Political News

దిగొచ్చిన మోడీ… కొత్త సాగు చ‌ట్టాల‌పై చ‌ర్చ‌కు ఓకే ఏకంగా 15 గంట‌లు

ఇప్ప‌టి వ‌రకు తాము ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు! అని ప‌ట్టుబ‌డుతూ.. నూత‌న సాగు చ‌ట్టాల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని, దీనిపై ఎవ‌రికీ తాము స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మొండికేస్తూ.. వ‌చ్చిన కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని స‌ర్కారు దిగి వ‌చ్చింది. విప‌క్షాల దూకుడుతో ఎట్ట‌కేల‌కు సాగు చ‌ట్టాల‌పై చ‌ర్చించేందుకు ప‌చ్చ‌జెండా ఊపింది. పార్లమెంట్‌లో రైతు ఉద్యమం, సాగు చ‌ట్టాల‌పై ఏకంగా ఏక‌ధాటిగా 15 గంటల పాటు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.

వాస్త‌వానికి పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు నుంచి ప్ర‌తిప‌క్షాలు సాగు చ‌ట్టాల విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాష్ట్ర‌ప తి ప్ర‌సంగాన్ని సైతం 18 ప్ర‌తిప‌క్ష పార్టీలు బ‌హిష్క‌రించాయి. అయినా.. కేంద్రం లైన్‌లోకి రాలేదు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి రైతులు త‌మ ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేసేందుకు సిద్ధ‌మైన నేప‌థ్యంలో అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ‌ల్లో .. విప‌క్షాలు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఉభయ సభలనూ మంగళవారం స్తంభింపజేశాయి.

ప్రతిపక్ష ఎంపీల నిరసనల హోరు మధ్య మంగళవారం రాజ్యసభ మూడుసార్లు.. లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడి.. చివరికి బుధవారానికి వాయిదా పడ్డాయి. అయితే, బుధ‌వారం కూడా వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుండ‌డంతో ఇక‌, ఎట్ట‌కేల‌కు ఈ అంశంపై చ‌ర్చిచేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చింది. ఏక‌ధాటిగా.. 15 గంట‌ల పాటు చ‌ర్చించేందుకు అంగీక‌రించింది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారని, ఈ అంశంపై చర్చించాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును వివిధ పార్టీల నేతలు దుయ్యబట్టారు. ఇక‌, ఈ ప‌రిస్థితిపై ఏమ‌నుకున్నారో.. ఏమో ప్ర‌ధాని, హోం శాఖ‌ల నుంచి అనుమ‌తి రాగానే.. స‌భ‌లో చ‌ర్చ‌కు అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. అయితే.. ఈ చ‌ర్చ‌లు ఎలా ముందుకు సాగుతాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల‌తోనే స‌రిపెడ‌తారా? రైతుల‌కు న్యాయం జ‌రుగుతుందా? అనేది మాత్రం వేచి చూడాలి.

This post was last modified on February 3, 2021 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago