సోషల్ మీడియా కాలంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమే. రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ కొట్టేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవతలి వాళ్ల లొసుగులు ఏ కాస్త దొరికినా వాటి మీద జరిగే నెగెటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీ విషయంలో కొన్ని నెలలుగా ఎంతటి విమర్శలు నడుస్తున్నాయో, సోషల్ మీడియాలో ఎంతగా ప్రతికూల ప్రచారం నడుస్తోందో తెలిసిందే.
లాక్ డౌన్ టైంలో మద్యం దుకాణాలు పున:ప్రారంభం కాగానే పేరున్న బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టేసి, మద్యం ధరలు విపరీతంగా పెంచేసి, అనేక లోకల్ బ్రాండ్లతో దుకాణాలను నింపేసింది వైకాపా ప్రభుత్వం. ఎక్కువగా వైకాపా నాయకులే ఈ బ్రాండ్లను ప్రవేశ పెట్టినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందూ కనీ వినీ ఎరుగని విచిత్రమైన పేర్లతో బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి మద్యం దుకాణాల్లో. ‘ప్రెసిడెంట్ మెడల్’ పేరుతో వచ్చిన ఒక బ్రాండ్ మీద ఇప్పటిదాకా ఎన్ని జోకులు పేలాయో లెక్కే లేదు. జగన్ ప్రభుత్వ పనితీరుకు మెచ్చి ‘ప్రెసిడెంట్ మెడల్’ ఇచ్చారంటూ వ్యంగ్యంగా స్పందించారు వైకాపా వ్యతిరేకులు.
ఐతే తాజాగా ‘స్పెషల్ స్టేటస్’ పేరుతో ఓ కొత్త బ్రాండ్ వచ్చినట్లుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టి ప్రచారం నడుస్తోంది. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్.. ఇప్పుడు నిజంగానే ఆ పని చేశాడంటూ ‘స్పెషల్ స్టేటస్’ పేరుతో ఉన్న మద్యం బాటిల్ను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ‘3 క్యాపిటల్స్’ పేరుతోనూ ఒక బ్రాండ్ కనిపిస్తోంది. దాని మీదా జోకులు పేలుతున్నాయి.
ఐతే నిజంగా ఈ బ్రాండ్లన్నీ మార్కెట్లోకి వచ్చాయా లేక వైకాపా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మార్ఫింగ్ చేసిన ఫొటోలను వదులుతున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఒకవేళ నిజంగా ఈ పేరుతో బ్రాండ్లను తీసుకొస్తుంటే మాత్రం అవి ప్రభుత్వానికి చాలా డ్యామేజింగ్గా మారతాయి కాబట్టి వైకాపా నాయకులు కొంచెం అప్రమత్తం కావాల్సిందే.
This post was last modified on February 2, 2021 3:28 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…