సోషల్ మీడియా కాలంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమే. రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ కొట్టేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవతలి వాళ్ల లొసుగులు ఏ కాస్త దొరికినా వాటి మీద జరిగే నెగెటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీ విషయంలో కొన్ని నెలలుగా ఎంతటి విమర్శలు నడుస్తున్నాయో, సోషల్ మీడియాలో ఎంతగా ప్రతికూల ప్రచారం నడుస్తోందో తెలిసిందే.
లాక్ డౌన్ టైంలో మద్యం దుకాణాలు పున:ప్రారంభం కాగానే పేరున్న బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టేసి, మద్యం ధరలు విపరీతంగా పెంచేసి, అనేక లోకల్ బ్రాండ్లతో దుకాణాలను నింపేసింది వైకాపా ప్రభుత్వం. ఎక్కువగా వైకాపా నాయకులే ఈ బ్రాండ్లను ప్రవేశ పెట్టినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందూ కనీ వినీ ఎరుగని విచిత్రమైన పేర్లతో బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి మద్యం దుకాణాల్లో. ‘ప్రెసిడెంట్ మెడల్’ పేరుతో వచ్చిన ఒక బ్రాండ్ మీద ఇప్పటిదాకా ఎన్ని జోకులు పేలాయో లెక్కే లేదు. జగన్ ప్రభుత్వ పనితీరుకు మెచ్చి ‘ప్రెసిడెంట్ మెడల్’ ఇచ్చారంటూ వ్యంగ్యంగా స్పందించారు వైకాపా వ్యతిరేకులు.
ఐతే తాజాగా ‘స్పెషల్ స్టేటస్’ పేరుతో ఓ కొత్త బ్రాండ్ వచ్చినట్లుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టి ప్రచారం నడుస్తోంది. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్.. ఇప్పుడు నిజంగానే ఆ పని చేశాడంటూ ‘స్పెషల్ స్టేటస్’ పేరుతో ఉన్న మద్యం బాటిల్ను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ‘3 క్యాపిటల్స్’ పేరుతోనూ ఒక బ్రాండ్ కనిపిస్తోంది. దాని మీదా జోకులు పేలుతున్నాయి.
ఐతే నిజంగా ఈ బ్రాండ్లన్నీ మార్కెట్లోకి వచ్చాయా లేక వైకాపా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మార్ఫింగ్ చేసిన ఫొటోలను వదులుతున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఒకవేళ నిజంగా ఈ పేరుతో బ్రాండ్లను తీసుకొస్తుంటే మాత్రం అవి ప్రభుత్వానికి చాలా డ్యామేజింగ్గా మారతాయి కాబట్టి వైకాపా నాయకులు కొంచెం అప్రమత్తం కావాల్సిందే.
This post was last modified on February 2, 2021 3:28 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…