Political News

చెన్నై, కేరళకు ఎన్నికల బంపర్ ఆఫర్

కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ధక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, కేరళ కు నిధుల వరద పాటించారు. కర్నాటక తమ పాలిత రాష్ట్రమే కాబట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించారు.

ఇక తమిళనాడు, కేరళకు ఎందుకు అంత భారీగా నిధులు కేటాయించారు ? ఎందుకంటే తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టే అని అర్ధమైపోతోంది. ఎలాగైనా కేరళ, తమిళనాడు ఎన్నికల్లో బోణి కొట్టాలని బేజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు కనబడటం లేదు. అందుకనే ఏఐఏడిఎంకే లాంటి పార్టీతో పొత్తపెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది.

రాజకీయంగా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టేస్తే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఎలాగూ వచ్చింది కాబట్టి తమిళనాడు, కేరళపై కేంద్రానికి అపారమైన ప్రేమ ఉన్నట్లు చూపించాలనే ప్రయత్నం జరిగింది. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏకంగా రూ. 63,246 కోట్లను కేటాయించింది. అలాగే కేరళ లోని మెట్రో రైలు ప్రాజెక్టుకు సుమారు రూ. 18 వేల కోట్లు కేటాయించారు. ఇక బెంగుళూరు మెట్రో ప్రాజెక్టుకు రూ. 14,788 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే కేరళ, తమిళనాడులో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వేలాది కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పకతప్పదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పై రెండు రాష్ట్రాల్లో వేలాది కోట్లు కేటాయించారు బాగానే ఉంది. మరి కేంద్రం అశించినట్లుగా కేరళ, తమిళనాడుల్లో బీజేపీ బోణి కొట్టకపోతే ఏమవుతుంది ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Satya

Recent Posts

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

51 minutes ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

3 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

8 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

10 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

10 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

12 hours ago