Political News

చెన్నై, కేరళకు ఎన్నికల బంపర్ ఆఫర్

కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ధక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, కేరళ కు నిధుల వరద పాటించారు. కర్నాటక తమ పాలిత రాష్ట్రమే కాబట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించారు.

ఇక తమిళనాడు, కేరళకు ఎందుకు అంత భారీగా నిధులు కేటాయించారు ? ఎందుకంటే తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టే అని అర్ధమైపోతోంది. ఎలాగైనా కేరళ, తమిళనాడు ఎన్నికల్లో బోణి కొట్టాలని బేజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు కనబడటం లేదు. అందుకనే ఏఐఏడిఎంకే లాంటి పార్టీతో పొత్తపెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది.

రాజకీయంగా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టేస్తే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఎలాగూ వచ్చింది కాబట్టి తమిళనాడు, కేరళపై కేంద్రానికి అపారమైన ప్రేమ ఉన్నట్లు చూపించాలనే ప్రయత్నం జరిగింది. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏకంగా రూ. 63,246 కోట్లను కేటాయించింది. అలాగే కేరళ లోని మెట్రో రైలు ప్రాజెక్టుకు సుమారు రూ. 18 వేల కోట్లు కేటాయించారు. ఇక బెంగుళూరు మెట్రో ప్రాజెక్టుకు రూ. 14,788 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే కేరళ, తమిళనాడులో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వేలాది కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పకతప్పదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పై రెండు రాష్ట్రాల్లో వేలాది కోట్లు కేటాయించారు బాగానే ఉంది. మరి కేంద్రం అశించినట్లుగా కేరళ, తమిళనాడుల్లో బీజేపీ బోణి కొట్టకపోతే ఏమవుతుంది ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

This post was last modified on February 1, 2021 3:02 pm

Share
Show comments

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

9 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

10 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

11 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

11 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

11 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

12 hours ago