వాహనాల విషయంలో కేంద్రప్రభుత్వం తాజా బడ్జెట్లో సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనాల విషయంలో తీసుకున్న కొత్త విధానాన్ని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వివరించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ళ డెడ్ లైన్ విధించారు. పై కాలపరిమితి ముగిసిన తర్వాత వాహనాలను ఫిట్ నెస్ టెస్టు చేయించాల్సిందే అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
అంటే కేంద్రమంత్రి ఉద్దేశ్యం ప్రకారం వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకు 15 సంవత్సరాలు పూర్తియితే వాటి జీవిత కాలం అయిపోయినట్లే. లైఫ్ టైం అయిపోయిన వాహనాలను తిప్పటం వల్ల నష్టాలు జరుగుతాయని ఆటోమొబైల్ రంగంలోని నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. వాహనాల పనితీరు బాగా పడిపోతుంది. దీనివల్ల వాటి సామర్ధ్యం తగ్గిపోవటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్లు నిపుణులు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు.
ఇపుడు జరుగుతున్న వాహనాల్లో చాలావరకు లైఫ్ టైం అయిపోయిన వాహనాలే అన్న విషయాలు బయపడుతున్నాయి. ముఖ్యంగా బస్సులు, లారీల ప్రమాదాల్లో ఈ విషయాలు స్పష్టంగా తెలిసిపోతోంది. అందుకనే రవాణాశాఖ చట్టాల్లో కూడా లైఫ్ టైం వాహనాల విషయాల్లో అనేక మార్పులు తెచ్చింది. మామూలుగా అయితే ప్యాసెంజర్ బస్సుల జీవితకాలం 7 లక్షల కిలోమీటర్లు. కానీ పది లక్షలు, 15 లక్షల కిలోమీటర్లు దాటిపోయిన బస్సులు కూడా ఇంకా తిరుగుతునే ఉంటాయి.
ఇటువంటి వాహనాల విషయంలోనే తాజా బడ్జెట్లో నిబంధనలు తెచ్చారు. పై కాలపరిమితి దాటిపోయిన వాహనాలను తుక్కుగా మార్చేస్తామని కేంద్రమంత్రి స్పష్టంగా ప్రకటించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని మంత్రి ప్రకటించారు. మంత్రి చెప్పిన నిబంధన గనుక అమల్లోకి వస్తే లక్షలాది ప్రభుత్వ వాహనాలే ముందు తుక్కుగా మారిపోవటం ఖాయం. చూద్దాం కొత్త నిబంధన ఎంతవరకు అమలవుతుందో.
This post was last modified on February 1, 2021 12:49 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…