వాహనాల విషయంలో కేంద్రప్రభుత్వం తాజా బడ్జెట్లో సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనాల విషయంలో తీసుకున్న కొత్త విధానాన్ని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వివరించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ళ డెడ్ లైన్ విధించారు. పై కాలపరిమితి ముగిసిన తర్వాత వాహనాలను ఫిట్ నెస్ టెస్టు చేయించాల్సిందే అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
అంటే కేంద్రమంత్రి ఉద్దేశ్యం ప్రకారం వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకు 15 సంవత్సరాలు పూర్తియితే వాటి జీవిత కాలం అయిపోయినట్లే. లైఫ్ టైం అయిపోయిన వాహనాలను తిప్పటం వల్ల నష్టాలు జరుగుతాయని ఆటోమొబైల్ రంగంలోని నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. వాహనాల పనితీరు బాగా పడిపోతుంది. దీనివల్ల వాటి సామర్ధ్యం తగ్గిపోవటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్లు నిపుణులు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు.
ఇపుడు జరుగుతున్న వాహనాల్లో చాలావరకు లైఫ్ టైం అయిపోయిన వాహనాలే అన్న విషయాలు బయపడుతున్నాయి. ముఖ్యంగా బస్సులు, లారీల ప్రమాదాల్లో ఈ విషయాలు స్పష్టంగా తెలిసిపోతోంది. అందుకనే రవాణాశాఖ చట్టాల్లో కూడా లైఫ్ టైం వాహనాల విషయాల్లో అనేక మార్పులు తెచ్చింది. మామూలుగా అయితే ప్యాసెంజర్ బస్సుల జీవితకాలం 7 లక్షల కిలోమీటర్లు. కానీ పది లక్షలు, 15 లక్షల కిలోమీటర్లు దాటిపోయిన బస్సులు కూడా ఇంకా తిరుగుతునే ఉంటాయి.
ఇటువంటి వాహనాల విషయంలోనే తాజా బడ్జెట్లో నిబంధనలు తెచ్చారు. పై కాలపరిమితి దాటిపోయిన వాహనాలను తుక్కుగా మార్చేస్తామని కేంద్రమంత్రి స్పష్టంగా ప్రకటించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని మంత్రి ప్రకటించారు. మంత్రి చెప్పిన నిబంధన గనుక అమల్లోకి వస్తే లక్షలాది ప్రభుత్వ వాహనాలే ముందు తుక్కుగా మారిపోవటం ఖాయం. చూద్దాం కొత్త నిబంధన ఎంతవరకు అమలవుతుందో.
This post was last modified on February 1, 2021 12:49 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…