ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇటీవల గణతంత్ర వేడుకలు(బీటింగ్ రిట్రీట్) నిర్వహించిన రాజ్పథ్కు 1.4 కిలో మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పైగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద ఈ పేలుడు సంభవించింది. ఓ పూల కుండీలో ఏర్పాటు చేసిన ఐఈడీ పేలుడు సంభవించడంతో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ పేలుడు ధాటికి కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సాయంత్రం 5గంటల 5 నిముషాల సమయంలో సంభవించిన ఈ పేలుడు స్థానికంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది.
పేలుడు ఘటన తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగిపోయారు. బాంబు నిర్వీర్య దళంతోపాటు.. ఎన్ ఎస్ జీ కమెండోలు, పోలీసులు భారీ ఎత్తున ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే.. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గుర్తించారు. అయితే.. సమీపంలో ఉన్న కార్ల అద్దాలు ధ్వంసం కావడం, కొన్ని కార్లకు టైర్లు పేలిపోవడం జరిగిందన్నారు. ఈ పేలుడు ఘటనతో ఢిల్లీలోని అన్ని రాయబార కార్యాలయాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయబార కార్యాలయానికి దారితీసే అన్ని రహదారులను భద్రతా దళాలు మూసివేశాయి.
ఇక, పేలుడు వెనుక ఉగ్రమూకల హస్తమేదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఘటనా ప్రాంతాన్ని స్పెషల్ టీం పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇక, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశ నిఘా విభాగం అలెర్టయింది. దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే.. అప్పట్లో ఏమీ జరగలేదు. కానీ, అనూహ్యంగా ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన ఈ పేలుడు సంచలనం సృష్టించింది. మరి దీని వెనుక ఎవరున్నారు? అనే విషయంపై అధికారులు అప్పుడే దర్యాప్తు ముమ్మరం చేశారు.
This post was last modified on January 29, 2021 7:25 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…