ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇటీవల గణతంత్ర వేడుకలు(బీటింగ్ రిట్రీట్) నిర్వహించిన రాజ్పథ్కు 1.4 కిలో మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పైగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద ఈ పేలుడు సంభవించింది. ఓ పూల కుండీలో ఏర్పాటు చేసిన ఐఈడీ పేలుడు సంభవించడంతో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ పేలుడు ధాటికి కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సాయంత్రం 5గంటల 5 నిముషాల సమయంలో సంభవించిన ఈ పేలుడు స్థానికంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది.
పేలుడు ఘటన తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగిపోయారు. బాంబు నిర్వీర్య దళంతోపాటు.. ఎన్ ఎస్ జీ కమెండోలు, పోలీసులు భారీ ఎత్తున ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే.. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గుర్తించారు. అయితే.. సమీపంలో ఉన్న కార్ల అద్దాలు ధ్వంసం కావడం, కొన్ని కార్లకు టైర్లు పేలిపోవడం జరిగిందన్నారు. ఈ పేలుడు ఘటనతో ఢిల్లీలోని అన్ని రాయబార కార్యాలయాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయబార కార్యాలయానికి దారితీసే అన్ని రహదారులను భద్రతా దళాలు మూసివేశాయి.
ఇక, పేలుడు వెనుక ఉగ్రమూకల హస్తమేదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఘటనా ప్రాంతాన్ని స్పెషల్ టీం పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇక, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశ నిఘా విభాగం అలెర్టయింది. దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే.. అప్పట్లో ఏమీ జరగలేదు. కానీ, అనూహ్యంగా ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన ఈ పేలుడు సంచలనం సృష్టించింది. మరి దీని వెనుక ఎవరున్నారు? అనే విషయంపై అధికారులు అప్పుడే దర్యాప్తు ముమ్మరం చేశారు.
This post was last modified on January 29, 2021 7:25 pm
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…