కరోనా వల్ల దాదాపు ఏడు నెలలు మూత పడ్డ థియేటర్లను గత ఏడాది అక్టోబరులో తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆక్యుపెన్సీని మాత్రం 50 శాతానికే పరిమితం చేసింది. మూడు నెలలు దాటినా అలాగే థియేటర్లు నడుస్తున్నాయి. ఈ మధ్య తమిళనాట అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చింది కానీ.. తర్వాత కేంద్రం బ్రేక్ వేసింది. ఐతే ఇప్పుడు కేంద్రం సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాల్లో భాగంగా థియేటర్ల ఆక్యుపెన్సీని పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఐతే 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి మాత్రం అవకాశం ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. 50 పర్సంట్ నుంచి ఆక్యుపెన్సీని పెంచబోతున్నట్లు మాత్రం పేర్కొంది ప్రభుత్వం. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. అంటే నెలాఖర్లోపే ఆక్యుపెన్సీ ఎంత అనేది తేలబోతోంది. బహుశా ఆక్యుపెన్సీని 75 శాతానికి పెంచుతారని.. వేసవి సమయానికి అది 100 పర్సంట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు కావడం, ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా తగ్గడం.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది మార్చి మధ్య నుంచి దేశవ్యాప్తంగా మూత పడి ఉన్న స్విమ్మింగ్ పూల్స్ను తెరిచేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పూల్స్ తెరుచుకోనున్నాయి. అంటే ఈ వేసవిలో పూల్స్ మళ్లీ జనాలతో కళకళలాడబోతున్నాయన్నమాట.
This post was last modified on January 28, 2021 1:18 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…