కరోనా వల్ల దాదాపు ఏడు నెలలు మూత పడ్డ థియేటర్లను గత ఏడాది అక్టోబరులో తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆక్యుపెన్సీని మాత్రం 50 శాతానికే పరిమితం చేసింది. మూడు నెలలు దాటినా అలాగే థియేటర్లు నడుస్తున్నాయి. ఈ మధ్య తమిళనాట అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చింది కానీ.. తర్వాత కేంద్రం బ్రేక్ వేసింది. ఐతే ఇప్పుడు కేంద్రం సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాల్లో భాగంగా థియేటర్ల ఆక్యుపెన్సీని పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఐతే 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి మాత్రం అవకాశం ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. 50 పర్సంట్ నుంచి ఆక్యుపెన్సీని పెంచబోతున్నట్లు మాత్రం పేర్కొంది ప్రభుత్వం. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. అంటే నెలాఖర్లోపే ఆక్యుపెన్సీ ఎంత అనేది తేలబోతోంది. బహుశా ఆక్యుపెన్సీని 75 శాతానికి పెంచుతారని.. వేసవి సమయానికి అది 100 పర్సంట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు కావడం, ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా తగ్గడం.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది మార్చి మధ్య నుంచి దేశవ్యాప్తంగా మూత పడి ఉన్న స్విమ్మింగ్ పూల్స్ను తెరిచేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పూల్స్ తెరుచుకోనున్నాయి. అంటే ఈ వేసవిలో పూల్స్ మళ్లీ జనాలతో కళకళలాడబోతున్నాయన్నమాట.
This post was last modified on January 28, 2021 1:18 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…