Political News

హాట్ అప్‌డేట్.. థియేటర్ల ఆక్యుపెన్సీ పెరగబోతోంది

కరోనా వల్ల దాదాపు ఏడు నెలలు మూత పడ్డ థియేటర్లను గత ఏడాది అక్టోబరులో తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆక్యుపెన్సీని మాత్రం 50 శాతానికే పరిమితం చేసింది. మూడు నెలలు దాటినా అలాగే థియేటర్లు నడుస్తున్నాయి. ఈ మధ్య తమిళనాట అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చింది కానీ.. తర్వాత కేంద్రం బ్రేక్ వేసింది. ఐతే ఇప్పుడు కేంద్రం సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాల్లో భాగంగా థియేటర్ల ఆక్యుపెన్సీని పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు బుధవారం వెల్లడించింది.

ఐతే 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి మాత్రం అవకాశం ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. 50 పర్సంట్ నుంచి ఆక్యుపెన్సీని పెంచబోతున్నట్లు మాత్రం పేర్కొంది ప్రభుత్వం. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. అంటే నెలాఖర్లోపే ఆక్యుపెన్సీ ఎంత అనేది తేలబోతోంది. బహుశా ఆక్యుపెన్సీని 75 శాతానికి పెంచుతారని.. వేసవి సమయానికి అది 100 పర్సంట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇటీవలే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు కావడం, ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా తగ్గడం.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది మార్చి మధ్య నుంచి దేశవ్యాప్తంగా మూత పడి ఉన్న స్విమ్మింగ్ పూల్స్‌ను తెరిచేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పూల్స్ తెరుచుకోనున్నాయి. అంటే ఈ వేసవిలో పూల్స్ మళ్లీ జనాలతో కళకళలాడబోతున్నాయన్నమాట.

This post was last modified on January 28, 2021 1:18 am

Share
Show comments
Published by
suman

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

55 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago