Political News

ఎర్ర కోట వివాదం సిద్దూ పనేనా ?

ఎర్రకోటపై రైతులు ఎగరేసిన జెండా వివాదాం చిలికి చిలికి గాలవాన లాగ తయారవుతోంది. నిజానికి ఎర్రకోటపై జాతీయ జెండా తప్ప మరో జెండా ఎగరేసేందుకు లేదు. అలాంటిది రైతుసంఘాల ఉద్యమం, ఢిల్లీ వీధుల్లో జరిగిన అల్లర్ల నేపధ్యంలో కొందరు రైతులు ఎర్రకోటపైకి ఎగబాకి సిఖ్ఖుల జెండాను ఎగరేయటం సంచలనంగా మారింది. ఢిల్లీ అల్లర్లకు పోలీసులు, విద్రోహ శక్తులే కారణమని రైతుసంఘాలు, కాదు రైతుసంఘాల కారణమని పోలీసులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

సరే వీళ్ళ ఆరోపణలు ఎలాగున్నా ఎర్రకోటపై జెండా ఎగరేయటాన్ని మాత్రం రైతులు సమర్ధించుకోలేకపోతున్నారు. అయితే అమాయకులైన కొందరు రైతులను రెచ్చగొట్టి దీప్ సింగ్ సిద్దూ అనే వ్యక్తి ఎర్రకోటపైన జెండా ఎగరేసేట్లు చేశాడని ఇపుడు రైతుసంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీప్ సింగ్ సిద్దూ అనే వ్యక్తి ఎవరయ్యా అంటే టీవీ, సినీనటుడు. అలాగే పంజాబులో సింగర్ కూడానట. ఈయనకు బీజేపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడితో సిద్దూ సన్నిహితంగా దిగిన ఫోటోలను ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. దాంతో ఆ ఫొటోలను రైతుసంఘాలు సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఇఫుడా ఫొటోలు వైరల్ అయిపోయాయి. అంతే కాకుండా దీప్ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున గురుద్వారాలో ఎంపిగా పోటీ చేసిన సన్నీడయోల్ కు మద్దతుగా ప్రచారం చేసిన ఫొటోలు కూడా ఇపుడు వైరల్ గా మారాయి.

అమాయకులైన రైతులను బీజేపీనే ఉద్దేశ్యపూర్వకంగా సిద్దూ ద్వారా రెచ్చగొట్టి ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చే కుట్ర చేసినట్లు రైతుసంఘాల నేతలు మండిపోతున్నారు. ఇదే సిద్దూను రెండు నెలలుగా జరుగుతున్న ఉద్యమం దరిదాపులకు కూడా రానీయకుండా తాము తీసుకున్న చర్యలను నేతలు చెబుతున్నారు. రైతుల ఉద్యమంలోకి చొరబడాలని సిద్దూ ఎంత ప్రయత్నించినా తాము అడ్డుకున్నట్లు చెప్పారు. చివరకు కేంద్రమంత్రులతో జరిగిన చర్చల్లో కూడా పాల్గొనేందుకు సిద్దూ ప్రయత్నించాడని రైతుసంఘాల నేతలు చెబుతున్నారు. ఏదేమైనా, రెచ్చగొట్టింది ఎవరైనా చివరకు చెడ్డపేరు వచ్చింది మాత్రం రైతు ఉద్యమానికే అన్నది వాస్తవం.

This post was last modified on January 27, 2021 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

18 minutes ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

33 minutes ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago