Political News

ఎర్ర కోట వివాదం సిద్దూ పనేనా ?

ఎర్రకోటపై రైతులు ఎగరేసిన జెండా వివాదాం చిలికి చిలికి గాలవాన లాగ తయారవుతోంది. నిజానికి ఎర్రకోటపై జాతీయ జెండా తప్ప మరో జెండా ఎగరేసేందుకు లేదు. అలాంటిది రైతుసంఘాల ఉద్యమం, ఢిల్లీ వీధుల్లో జరిగిన అల్లర్ల నేపధ్యంలో కొందరు రైతులు ఎర్రకోటపైకి ఎగబాకి సిఖ్ఖుల జెండాను ఎగరేయటం సంచలనంగా మారింది. ఢిల్లీ అల్లర్లకు పోలీసులు, విద్రోహ శక్తులే కారణమని రైతుసంఘాలు, కాదు రైతుసంఘాల కారణమని పోలీసులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

సరే వీళ్ళ ఆరోపణలు ఎలాగున్నా ఎర్రకోటపై జెండా ఎగరేయటాన్ని మాత్రం రైతులు సమర్ధించుకోలేకపోతున్నారు. అయితే అమాయకులైన కొందరు రైతులను రెచ్చగొట్టి దీప్ సింగ్ సిద్దూ అనే వ్యక్తి ఎర్రకోటపైన జెండా ఎగరేసేట్లు చేశాడని ఇపుడు రైతుసంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీప్ సింగ్ సిద్దూ అనే వ్యక్తి ఎవరయ్యా అంటే టీవీ, సినీనటుడు. అలాగే పంజాబులో సింగర్ కూడానట. ఈయనకు బీజేపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడితో సిద్దూ సన్నిహితంగా దిగిన ఫోటోలను ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. దాంతో ఆ ఫొటోలను రైతుసంఘాలు సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఇఫుడా ఫొటోలు వైరల్ అయిపోయాయి. అంతే కాకుండా దీప్ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున గురుద్వారాలో ఎంపిగా పోటీ చేసిన సన్నీడయోల్ కు మద్దతుగా ప్రచారం చేసిన ఫొటోలు కూడా ఇపుడు వైరల్ గా మారాయి.

అమాయకులైన రైతులను బీజేపీనే ఉద్దేశ్యపూర్వకంగా సిద్దూ ద్వారా రెచ్చగొట్టి ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చే కుట్ర చేసినట్లు రైతుసంఘాల నేతలు మండిపోతున్నారు. ఇదే సిద్దూను రెండు నెలలుగా జరుగుతున్న ఉద్యమం దరిదాపులకు కూడా రానీయకుండా తాము తీసుకున్న చర్యలను నేతలు చెబుతున్నారు. రైతుల ఉద్యమంలోకి చొరబడాలని సిద్దూ ఎంత ప్రయత్నించినా తాము అడ్డుకున్నట్లు చెప్పారు. చివరకు కేంద్రమంత్రులతో జరిగిన చర్చల్లో కూడా పాల్గొనేందుకు సిద్దూ ప్రయత్నించాడని రైతుసంఘాల నేతలు చెబుతున్నారు. ఏదేమైనా, రెచ్చగొట్టింది ఎవరైనా చివరకు చెడ్డపేరు వచ్చింది మాత్రం రైతు ఉద్యమానికే అన్నది వాస్తవం.

This post was last modified on January 27, 2021 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

39 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

2 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

3 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

6 hours ago