ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని వేలెత్తి చూపించాలి? గెలుపోటములు పక్కన పెట్టేద్దాం. దేశ గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ జాతీయ పతాకం పక్కగా.. నిరసన జెండా ఎగరటం దేనికి సంకేతం? ఎవరికి వారు తమ వాదనల్ని బలంగా వినిపించొచ్చు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా ఎగిరిన రైతు జెండా.. మోడీ సర్కారు మొండితనానికి చెంపదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో.. మరే ప్రదేశంలో అయినా ఇలాంటివి బాగానే ఉండేవి. దేశ గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక ప్రదేశంలో.. రైతు నిరసన జెండా ఎగురటం సరికాదన్న మాట వినిపిస్తోంది.
సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. జాతి ఔనత్యాన్ని ప్రతీకగా నిలిచే చోట.. నిరసనల్ని ప్రదర్శించక తప్పదా? అన్నదే ప్రశ్న. ఇప్పటివరకు రైతులకు దన్నుగా నిలిచిన ఎంతోమంది.. తాజాగా చేసిన చేష్టను మాత్రం తప్పు పడుతున్నారు. నిరసనకు ఒక పద్దతి ఉంటుందని.. దాన్ని అతిక్రమించే తీరు సరికాదంటున్నారు. మరోవైపు.. రైతుల చర్యలకు వత్తాసు పలికే వారు లేకపోలేదు.
తమ హక్కుల సాధనం కోసం నెలల తరబడి నిరసన చేస్తున్న రైతులు.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఎర్రకోట వద్ద తమ ఉద్యమ జెండాను ఎగురవేయటం సంచలనంగా మారింది. బారికేడ్లు.. లాఠీలు.. టియర్ గ్యాస్ ఆందోళన మధ్య రైతులు నిర్వహించిన ట్రాక్టర్ర పరేడ్ ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది.
ఇలాంటి అడ్డంకుల్ని ఎన్నింటినో అధిగమించి ఎర్రకోటకు చేరుకున్న పలువురు రైతులు.. ఎర్రకోట వద్ద నిరసన జెండాను ఎగురవేశారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక.. సెంట్రల్ ఢిల్లీలో ఆందోళనకారులు చొచ్చుకురావటానికి ప్రయత్నించిన రైతుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటమే కాదు.. రైతులపై బాష్ప వాయువును ప్రయోగించారు. రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంలో రైతులే కాదు.. పోలీసులు కూడా గాయపడ్డారు.
This post was last modified on January 27, 2021 2:28 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…