రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు ముసురుకున్న మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పైగా.. ఇప్పటికే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో తాము వేలు పెట్టేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. రెండు రాజ్యాంగ బద్ధ సంస్థకు అందరూ సమానులే.. అనే వ్యాఖ్య చేయడం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని పేర్కొన్న ధర్మాసనం.. అక్కడ లేని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు? అనేది ప్రధాన ప్రశ్న.
ప్రభుత్వం ఈగోకు పోతోందన్నది సుప్రీకోర్టు చేసిన మరో కీలక వ్యాఖ్య. రాజ్యాంగ బద్ధమైన సంస్థల విషయంలో ప్రభుత్వాలు సహకరించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. ఎన్నికలను వాయిదా వేయడం.. వేయించడం.. అలవాటుగా మారిందనే తీవ్ర వ్యాఖ్యలుకూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హైకోర్టు ఈ ఎన్నికలపై తీర్పు చెప్పిన దరిమిలా.. అప్పటికే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడం అసమంజసంగా ఉందనేది సుప్రీం భావన.
ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంల ప్రభుత్వం.. ఎన్నికల సంఘానికి సంపూ ర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం సహకరించడమే ప్రజాస్వామ్య ప్రభు త్వమే మాటకు అర్ధం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోర్టులపేరుతో ప్రజా ధనం చాలానే వృధా అయింది. ఇప్పుడు కూడా ఇంకా పంతాలకు పోవడం వల్ల.. ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టే చెప్పినట్టు.. ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…