రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు ముసురుకున్న మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పైగా.. ఇప్పటికే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో తాము వేలు పెట్టేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. రెండు రాజ్యాంగ బద్ధ సంస్థకు అందరూ సమానులే.. అనే వ్యాఖ్య చేయడం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని పేర్కొన్న ధర్మాసనం.. అక్కడ లేని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు? అనేది ప్రధాన ప్రశ్న.
ప్రభుత్వం ఈగోకు పోతోందన్నది సుప్రీకోర్టు చేసిన మరో కీలక వ్యాఖ్య. రాజ్యాంగ బద్ధమైన సంస్థల విషయంలో ప్రభుత్వాలు సహకరించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. ఎన్నికలను వాయిదా వేయడం.. వేయించడం.. అలవాటుగా మారిందనే తీవ్ర వ్యాఖ్యలుకూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హైకోర్టు ఈ ఎన్నికలపై తీర్పు చెప్పిన దరిమిలా.. అప్పటికే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడం అసమంజసంగా ఉందనేది సుప్రీం భావన.
ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంల ప్రభుత్వం.. ఎన్నికల సంఘానికి సంపూ ర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం సహకరించడమే ప్రజాస్వామ్య ప్రభు త్వమే మాటకు అర్ధం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోర్టులపేరుతో ప్రజా ధనం చాలానే వృధా అయింది. ఇప్పుడు కూడా ఇంకా పంతాలకు పోవడం వల్ల.. ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టే చెప్పినట్టు.. ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on January 25, 2021 3:13 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…