Political News

అందరిలోను పెరిగిపోతున్న టెన్షన్

రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నిర్వహణ విషయంపై అందరిలోను హై టెన్షన్ పెరిగిపోతోంది. ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య మొదలైన పంచాయితి రోజుకో మలుపు తిరుగుతు అందరిలోను తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సోమవారం నుండి పంచాయితి ఎన్నికల నామినేషన్లను తీసుకోవాల్సుంది. అయితే దీనికి 11 జిల్లాలో ఎక్కడా అందుకు తగ్గ ఏర్పాట్లు కాలేదు. ఏ జిల్లాలో కూడా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకమే జరగలేదు.

రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకమే జరగలేదు కాబట్టి దిగువస్ధాయి పోలింగ్ సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు. సుమారు 1.2 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కావాల్సుంది. అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలోను సుమారు 5 మంది సిబ్బంది అవసరం. పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ అధికారి, అసస్టెంట్ పోలిసింగ్ అధికారి, ఎన్నికల గుర్తు వేసే అధికారి, బ్యాలెట్ పేపర్ ను ఇచ్చే సిబ్బందికి తోడు పోలింగ్ కేంద్రం దగ్గర కనీసం నలుగురు పోలీసులు కాపలాగ ఉండాలి.

ఈ లెక్కన సుమారుగా 1.2 లక్షల పోలింగ్ కేంద్రాలంటే ఎన్ని లక్షలమంది పోలింగ్ సిబ్బంది అవసరమో అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో పోటీచేసే అభ్యర్ధులకు నామినేషన్ పత్రాలు ఇవ్వటం, తీసుకోవటం వేరే ప్రక్రియ. అలాటే ప్రతి అభ్యర్ధికి ఓటర్లజాబితాను ఇవ్వాలి. ఇలాంటివి ఏవీ కాకుండానే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనంతట తానుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు.

సోమవారం విచారణలో సుప్రింకోర్టు కానీ లేదా హైకోర్టు కానీ ఎన్నికలను వాయిదా వేస్తే సమస్యుండదు. కానీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెబితే అప్పుడేమవుతుంది ? అన్న విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెబితె వెంటనే ఉద్యోగులు సమ్మెలోకి వెళటానికి రెడెగా ఉన్నారు. ఉద్యోగులు సమ్మెలోకి వెళితే అప్పుడేమవుతుందన్నదే హై ఓల్టేజీ టెన్షన్ గా మారింది. ఒకవేళ సిబ్బంది అందరు సమ్మెలోకి వెళ్ళకపోయినా ఎన్నికలకు ఏర్పాట్లే జరగలేదు. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అంతా గందరగోళంగా ఉంది.

This post was last modified on January 25, 2021 11:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

28 mins ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

6 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

6 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

7 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

8 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

8 hours ago