రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నిర్వహణ విషయంపై అందరిలోను హై టెన్షన్ పెరిగిపోతోంది. ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య మొదలైన పంచాయితి రోజుకో మలుపు తిరుగుతు అందరిలోను తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సోమవారం నుండి పంచాయితి ఎన్నికల నామినేషన్లను తీసుకోవాల్సుంది. అయితే దీనికి 11 జిల్లాలో ఎక్కడా అందుకు తగ్గ ఏర్పాట్లు కాలేదు. ఏ జిల్లాలో కూడా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకమే జరగలేదు.
రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకమే జరగలేదు కాబట్టి దిగువస్ధాయి పోలింగ్ సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు. సుమారు 1.2 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కావాల్సుంది. అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలోను సుమారు 5 మంది సిబ్బంది అవసరం. పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ అధికారి, అసస్టెంట్ పోలిసింగ్ అధికారి, ఎన్నికల గుర్తు వేసే అధికారి, బ్యాలెట్ పేపర్ ను ఇచ్చే సిబ్బందికి తోడు పోలింగ్ కేంద్రం దగ్గర కనీసం నలుగురు పోలీసులు కాపలాగ ఉండాలి.
ఈ లెక్కన సుమారుగా 1.2 లక్షల పోలింగ్ కేంద్రాలంటే ఎన్ని లక్షలమంది పోలింగ్ సిబ్బంది అవసరమో అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో పోటీచేసే అభ్యర్ధులకు నామినేషన్ పత్రాలు ఇవ్వటం, తీసుకోవటం వేరే ప్రక్రియ. అలాటే ప్రతి అభ్యర్ధికి ఓటర్లజాబితాను ఇవ్వాలి. ఇలాంటివి ఏవీ కాకుండానే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనంతట తానుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు.
సోమవారం విచారణలో సుప్రింకోర్టు కానీ లేదా హైకోర్టు కానీ ఎన్నికలను వాయిదా వేస్తే సమస్యుండదు. కానీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెబితే అప్పుడేమవుతుంది ? అన్న విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెబితె వెంటనే ఉద్యోగులు సమ్మెలోకి వెళటానికి రెడెగా ఉన్నారు. ఉద్యోగులు సమ్మెలోకి వెళితే అప్పుడేమవుతుందన్నదే హై ఓల్టేజీ టెన్షన్ గా మారింది. ఒకవేళ సిబ్బంది అందరు సమ్మెలోకి వెళ్ళకపోయినా ఎన్నికలకు ఏర్పాట్లే జరగలేదు. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అంతా గందరగోళంగా ఉంది.
This post was last modified on January 25, 2021 11:33 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…