ఓ పన్నెండేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. బాధితురాలి వక్షోజాల్ని నొక్కాడన్నది ఆ వ్యక్తిపై ఉన్న అభియోగం. ఐతే నేరుగా చేత్తో వక్షోజాల్ని తాకితేనే (స్కిన్ టు స్కిన్) లైంగిక దాడికి పాల్పడినట్లు అవుతుందని, ఒంటిపై టాప్ ఉండగా ఇలా చేయడం లైంగిక దాడి కిందికి రాదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ.. నిందితుడి చర్యలో తప్పు లేదన్నట్లుగా, లైంగిక దాడి విషయంలో కోర్టు ఇచ్చిన నిర్వచనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ తీర్పును మహిళా వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మహిళలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించి ఎంత చర్చ జరిగినా, చట్టాలు ఎంత కఠినతరం చేసినా రోజూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి సమయంలో లైంగిక దాడికి కోర్టు ఇచ్చిన నిర్వచనం దురుద్దేశాలున్న పురుషులకు ఆయుధంగా మారుతుందని మహిళా వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయని చిన్మయి, నటి తాప్సి తదితరులు ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టారు.
మన దేశంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇదని.. ఈ దేశంలో లైంగిక దాడి చేసేవాళ్ల కోసమే ఉందని చిన్మయి వ్యాఖ్యానించింది. సంబంధిత వార్తను షేర్ చేసిన తాప్సి.. దీనిపై తనకు ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదని, మాటలు రావట్లేదని ట్వీట్ చేసింది. కోర్టు ధిక్కారం అని కూడా చూడకుండా చాలామంది మహిళా వాదులు ఈ తీర్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ తీర్పుపై పెద్ద చర్చే నడుస్తోంది.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…