ఓ పన్నెండేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. బాధితురాలి వక్షోజాల్ని నొక్కాడన్నది ఆ వ్యక్తిపై ఉన్న అభియోగం. ఐతే నేరుగా చేత్తో వక్షోజాల్ని తాకితేనే (స్కిన్ టు స్కిన్) లైంగిక దాడికి పాల్పడినట్లు అవుతుందని, ఒంటిపై టాప్ ఉండగా ఇలా చేయడం లైంగిక దాడి కిందికి రాదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ.. నిందితుడి చర్యలో తప్పు లేదన్నట్లుగా, లైంగిక దాడి విషయంలో కోర్టు ఇచ్చిన నిర్వచనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ తీర్పును మహిళా వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మహిళలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించి ఎంత చర్చ జరిగినా, చట్టాలు ఎంత కఠినతరం చేసినా రోజూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి సమయంలో లైంగిక దాడికి కోర్టు ఇచ్చిన నిర్వచనం దురుద్దేశాలున్న పురుషులకు ఆయుధంగా మారుతుందని మహిళా వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయని చిన్మయి, నటి తాప్సి తదితరులు ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టారు.
మన దేశంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇదని.. ఈ దేశంలో లైంగిక దాడి చేసేవాళ్ల కోసమే ఉందని చిన్మయి వ్యాఖ్యానించింది. సంబంధిత వార్తను షేర్ చేసిన తాప్సి.. దీనిపై తనకు ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదని, మాటలు రావట్లేదని ట్వీట్ చేసింది. కోర్టు ధిక్కారం అని కూడా చూడకుండా చాలామంది మహిళా వాదులు ఈ తీర్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ తీర్పుపై పెద్ద చర్చే నడుస్తోంది.
This post was last modified on January 24, 2021 10:38 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…