Political News

ఎన్నికలు బాయ్ కాట్ చేస్తాం: ఏపీ ఉద్యోగ సంఘాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుందని నేడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోపక్క, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమంటూ సుప్రీం కోర్టును ఏపీ సర్కార్ ఆశ్రయించింది. మరోవైపు, ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్యోగుల సంఘాలు కూడా ససేమిరా అంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు సంచలన ప్రకటన చేశాయి. పంచాయతీ ఎన్నికలు ఆపాలని, లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. అవసరమైతే సమ్మె చేసేందుకు కూడా సిద్ధమని, ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ తీరు బాధాకరమని అన్నారు. కరోనా మహమ్మారి ఎంతోమంది ఉద్యోగులను, ప్రజలను బలితీసుకుందని, కాబట్టి వ్యాక్సినేషన్ అనంతరం ఎన్నికలకు వెళతామని అన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి విన్నవించామని, అయినా కూడా ఎస్ఈసీ మొండి వైఖరితో ముందుకు వెళుతోందని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణలో తమ ఇబ్బందులను వివరిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సోమవారం నాడు ఈ వ్యవహారం విచారణకు రానుందని అన్నారు. అయితే, ఈ లోపే హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేసిందని, ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎన్నికల నిర్వహణ అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

రెండున్నరేళ్లుగా ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని, కానీ, హుటాహుటిన ఎన్నికలు నిర్వహించి ఉద్యోగులను చంపమని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. గాజు అద్దాల చాటు నుంచి ఎస్ ఈసీ ప్రెస్ మీట్లో మాట్లాడారని, అలాగే తాము కూడా ఎన్నికల విధులు నిర్వర్తించాలా..? అని ప్రశ్నించారు. తమవిజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు చేసి నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చారని, దీనిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల తర్వాత కరోనా కేసులు పెరిగాయిని, అందుకే ఎన్నికలను బాయ్ కాట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఏపీ ఎన్జీవోస్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వ్యవస్థలు బరితెగించాయని, ఏపీ రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

This post was last modified on January 23, 2021 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

2 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

5 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

6 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

6 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

6 hours ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago