ఇది కరోనా టైం. మాస్క్ వాడకుండా ఎవ్వరూ బయటికి వచ్చే పరిస్థితి లేదు. భారత్ లాంటి దేశాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా జనాలకు అవగాహన వచ్చి మాస్కులు వాడుతున్నారు. అలాంటిది అమెరికా లాంటి దేశంలో మాస్కుల వాడకంపై ఇంకెంత అవగాహన ఉండాలి. అందులోనూ అక్కడ కరోనా వ్యాప్తి, మరణాల రేటు హెచ్చు స్థాయిలో ఉన్న నేపథ్యంలో జనాలు మరింత అప్రమత్తంగా ఉండాలి.
కానీ ఒక దుకాణంలోకి మాస్క్ లేదన్న కారణంతో తన కూతురిని అనుమతించలేదన్న కోపంతో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపేసిన సంఘటన సంచలనం రేపుతోంది. అమెరికాలోని మిచిగాన్ స్టేట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. అమెరికాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మిచిగాన్ ఒకటి. అక్కడి ఫ్లింట్ ప్రాంతంలో షార్మెల్ టీగ్ అనే ఓ మహిళ కూతురితో కలిసి ఓ గ్రాసరీ దుకాణానికి వెళ్లింది.
ఐతే షార్మెల్ కూతురు మాస్క్ తొడుక్కోకపోవడంతో సెక్యూరిటీ గార్డు ఆపాడు. అతడితో షార్మెల్ వాగ్వాదానికి దిగింది. మాటా మాటా పెరిగి ఆమె గన్ను తీసి గార్డు తలకు గురి పెట్టి కాల్చింది. అతను అక్కడిక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ ఘోరం చోటు చేసుకున్న సమయంలో షార్మెల్తో పాటు ఆమె భర్త, కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు షార్మెల్ను అరెస్టు చేయగా.. ఆమె భర్త, కొడుకు అక్కడి నుంచి పరారయ్యారు.
షార్మెల్ కూతురిపై పోలీసులు ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. మిచిగాన్ రాష్ట్ర వ్యాప్తంగా జనాలు బయటికి వస్తే మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్కుల్లేకుండా ఏ దుకాణంలోకి జనాల్ని అనుమతించట్లేదు. సెక్యూరిటీ గార్డు నిబంధనల మేరకే వ్యవహరించినా.. షార్మెల్ దురుసుగా వ్యవహరించి అతడి ప్రాణాలు బలిగొందని దుకాణ నిర్వాహకులు అంటున్నారు.
This post was last modified on May 6, 2020 2:19 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…