Political News

మాస్క్ వాడమన్నందుకు చంపేశారు

ఇది కరోనా టైం. మాస్క్ వాడకుండా ఎవ్వరూ బయటికి వచ్చే పరిస్థితి లేదు. భారత్ లాంటి దేశాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా జనాలకు అవగాహన వచ్చి మాస్కులు వాడుతున్నారు. అలాంటిది అమెరికా లాంటి దేశంలో మాస్కుల వాడకంపై ఇంకెంత అవగాహన ఉండాలి. అందులోనూ అక్కడ కరోనా వ్యాప్తి, మరణాల రేటు హెచ్చు స్థాయిలో ఉన్న నేపథ్యంలో జనాలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

కానీ ఒక దుకాణంలోకి మాస్క్ లేదన్న కారణంతో తన కూతురిని అనుమతించలేదన్న కోపంతో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపేసిన సంఘటన సంచలనం రేపుతోంది. అమెరికాలోని మిచిగాన్ స్టేట్‌లో ఈ ఘోరం చోటు చేసుకుంది. అమెరికాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మిచిగాన్ ఒకటి. అక్కడి ఫ్లింట్ ప్రాంతంలో షార్మెల్ టీగ్ అనే ఓ మహిళ కూతురితో కలిసి ఓ గ్రాసరీ దుకాణానికి వెళ్లింది.

ఐతే షార్మెల్ కూతురు మాస్క్ తొడుక్కోకపోవడంతో సెక్యూరిటీ గార్డు ఆపాడు. అతడితో షార్మెల్ వాగ్వాదానికి దిగింది. మాటా మాటా పెరిగి ఆమె గన్ను తీసి గార్డు తలకు గురి పెట్టి కాల్చింది. అతను అక్కడిక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ ఘోరం చోటు చేసుకున్న సమయంలో షార్మెల్‌తో పాటు ఆమె భర్త, కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు షార్మెల్‌ను అరెస్టు చేయగా.. ఆమె భర్త, కొడుకు అక్కడి నుంచి పరారయ్యారు.

షార్మెల్ కూతురిపై పోలీసులు ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. మిచిగాన్ రాష్ట్ర వ్యాప్తంగా జనాలు బయటికి వస్తే మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్కుల్లేకుండా ఏ దుకాణంలోకి జనాల్ని అనుమతించట్లేదు. సెక్యూరిటీ గార్డు నిబంధనల మేరకే వ్యవహరించినా.. షార్మెల్ దురుసుగా వ్యవహరించి అతడి ప్రాణాలు బలిగొందని దుకాణ నిర్వాహకులు అంటున్నారు.

This post was last modified on May 6, 2020 2:19 am

Share
Show comments
Published by
suman

Recent Posts

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

8 minutes ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

1 hour ago

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

2 hours ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

2 hours ago

జ‌గ‌న్‌ను మ‌రోసారి ఏకేసిన‌ ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్.. లండ‌న్ నుంచి ఇలా వ‌చ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు,…

3 hours ago

జూనియర్ అభిమానులు ఎందుకు ఫీలయ్యారు

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…

4 hours ago