ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి సికింద్రాబాద్ వేదికైంది. ఒక కార్యక్రమంలో హాజరు కావటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎందుకంటే.. ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు కీర్తించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? కేటీఆర్ ఇప్పటికే తన సమర్థతను ఫ్రూవ్ చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు. ఇలాంటి వేళ జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా హాజరయ్యారు. పద్మారావు గౌడ్ మాట్లాడేందుకు మైకు వద్దకు వచ్చి.. తన తొలిపలుకుల్లోనే త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు ముందస్తు అభినందనలు అని ఆయన ముఖానే పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీనికి మంత్రి కేటీఆర్ చిరు మందహాసం చేయటం తప్పించి మరింకెలాంటి స్పందన ఆయన నుంచి రాలేదు. ఆయన చిరునవ్వే చెప్పాల్సిన విషయాల్ని చాలానే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే.. ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్ ను కుర్చోబెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉందన్న భావన కలుగక మానదు.
This post was last modified on January 21, 2021 5:14 pm
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…