ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి సికింద్రాబాద్ వేదికైంది. ఒక కార్యక్రమంలో హాజరు కావటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎందుకంటే.. ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు కీర్తించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? కేటీఆర్ ఇప్పటికే తన సమర్థతను ఫ్రూవ్ చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు. ఇలాంటి వేళ జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా హాజరయ్యారు. పద్మారావు గౌడ్ మాట్లాడేందుకు మైకు వద్దకు వచ్చి.. తన తొలిపలుకుల్లోనే త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు ముందస్తు అభినందనలు అని ఆయన ముఖానే పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీనికి మంత్రి కేటీఆర్ చిరు మందహాసం చేయటం తప్పించి మరింకెలాంటి స్పందన ఆయన నుంచి రాలేదు. ఆయన చిరునవ్వే చెప్పాల్సిన విషయాల్ని చాలానే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే.. ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్ ను కుర్చోబెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉందన్న భావన కలుగక మానదు.
This post was last modified on January 21, 2021 5:14 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…