ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి సికింద్రాబాద్ వేదికైంది. ఒక కార్యక్రమంలో హాజరు కావటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎందుకంటే.. ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు కీర్తించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? కేటీఆర్ ఇప్పటికే తన సమర్థతను ఫ్రూవ్ చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు. ఇలాంటి వేళ జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా హాజరయ్యారు. పద్మారావు గౌడ్ మాట్లాడేందుకు మైకు వద్దకు వచ్చి.. తన తొలిపలుకుల్లోనే త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు ముందస్తు అభినందనలు అని ఆయన ముఖానే పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీనికి మంత్రి కేటీఆర్ చిరు మందహాసం చేయటం తప్పించి మరింకెలాంటి స్పందన ఆయన నుంచి రాలేదు. ఆయన చిరునవ్వే చెప్పాల్సిన విషయాల్ని చాలానే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే.. ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్ ను కుర్చోబెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉందన్న భావన కలుగక మానదు.
This post was last modified on January 21, 2021 5:14 pm
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…