ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి సికింద్రాబాద్ వేదికైంది. ఒక కార్యక్రమంలో హాజరు కావటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎందుకంటే.. ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు కీర్తించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? కేటీఆర్ ఇప్పటికే తన సమర్థతను ఫ్రూవ్ చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు. ఇలాంటి వేళ జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా హాజరయ్యారు. పద్మారావు గౌడ్ మాట్లాడేందుకు మైకు వద్దకు వచ్చి.. తన తొలిపలుకుల్లోనే త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు ముందస్తు అభినందనలు అని ఆయన ముఖానే పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీనికి మంత్రి కేటీఆర్ చిరు మందహాసం చేయటం తప్పించి మరింకెలాంటి స్పందన ఆయన నుంచి రాలేదు. ఆయన చిరునవ్వే చెప్పాల్సిన విషయాల్ని చాలానే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే.. ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్ ను కుర్చోబెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉందన్న భావన కలుగక మానదు.
This post was last modified on January 21, 2021 5:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…