రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసిన రాజధాని భూముల ఇన్సైడెర్ ట్రేడింగ్ తూచ్ యేనా? ఈ ఆరోపణలు కేవలం రాజకీయమేనా? ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకు చేసిన ఆరోపణలన్నీ డొల్లేనా? అన్నీ నిరాధారాలేనా? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నా యి. ప్రపంచంలో అతి పెద్దనగరంగా. అత్యంత ప్రభావితమైన రాజధానిగా ఉంటుందని భావించి గత ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో నిర్ణయించి.. శంకుస్థాపన చేసిన ఆంధ్రుల దేవభూమి.. అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కారు అనేక వాదనలు తెరమీదికి తెచ్చింది.
దీనిలో ప్రధానమైంది.. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని. అమరావతి ఎక్కడ ఏర్పడుతుందో ముందుగానే తన వారికి లీక్ చేయడం వల్ల చంద్రబాబు మనుషులు.. రాజధాని ప్రాంతలో రైతులను మభ్యపరిచి.. భూములను అతితక్కువకు కొనేసి.. తర్వాత రాజధాని భూముల సమీకరణలో భారీ మొత్తాలకు ప్రభుత్వానికి విక్రయించారని.. కొందరు తమ దగ్గరే ఉంచారని.. అందుకే రాజధాని భూముల్లో భారీ కుంభకోణం జరిగిందని ప్రభుత్వం వాదించిన.. వాదిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలోనూ దీనిపై రోజుల తరబడి చర్చ కూడా జరిగింది. కమిటీలను కూడా వేశారు. ఇక, ఈ క్రమంలోనే ఇక్కడ భూములు కొన్నారనే మిషతో.. కొందరిపై హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి.
ఇలాంటి కేసుల్లో ఒక దానిని తాజా హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్తో పాటు మరికొందరు అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారని పేర్కొంటూ.. హైకోర్టలో కేసు దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు పక్షాల వాదనలు విన్నది. ఈ క్రమంలో భూములు అమ్మినవారు ఎవరు ఫిర్యాదు చేయలేదని, కేసు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమ్ముకున్న వారు ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని ఆయన తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ అంశంలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని విచారణ అనంతరం హైకోర్టు పేర్కొంది. ఇన్సైడ్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని ధర్మాసనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. ప్రభుత్వానికి ఈ పరిణామం భారీ దెబ్బేనని అంటున్నారు నిపుణులు.
This post was last modified on January 19, 2021 1:51 pm
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…