Political News

వైసీపీ స‌ర్కారుకు షాక్‌: ఇన్‌సైడర్ ట్రేడింగ్ తూచ్.. కేసు కొట్టేసిన హైకోర్ట్‌

రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున ప్ర‌చారం చేసిన రాజ‌ధాని భూముల ఇన్‌సైడెర్ ట్రేడింగ్ తూచ్ యేనా? ఈ ఆరోప‌ణ‌లు కేవ‌లం రాజ‌కీయ‌మేనా? ముఖ్య‌మంత్రి నుంచి మంత్రుల వ‌ర‌కు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వ‌రకు చేసిన ఆరోప‌ణ‌లన్నీ డొల్లేనా? అన్నీ నిరాధారాలేనా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నా యి. ప్ర‌పంచంలో అతి పెద్ద‌న‌గ‌రంగా. అత్యంత ప్ర‌భావిత‌మైన రాజ‌ధానిగా ఉంటుంద‌ని భావించి గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దూర‌దృష్టితో నిర్ణ‌యించి.. శంకుస్థాప‌న చేసిన ఆంధ్రుల దేవ‌భూమి.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అనేక వాద‌న‌లు తెర‌మీదికి తెచ్చింది.

దీనిలో ప్ర‌ధాన‌మైంది.. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని. అమ‌రావ‌తి ఎక్క‌డ ఏర్ప‌డుతుందో ముందుగానే త‌న వారికి లీక్ చేయ‌డం వ‌ల్ల చంద్ర‌బాబు మ‌నుషులు.. రాజ‌ధాని ప్రాంత‌లో రైతుల‌ను మ‌భ్య‌ప‌రిచి.. భూముల‌ను అతిత‌క్కువ‌కు కొనేసి.. త‌ర్వాత రాజ‌ధాని భూముల స‌మీక‌ర‌ణ‌లో భారీ మొత్తాల‌కు ప్ర‌భుత్వానికి విక్ర‌యించార‌ని.. కొంద‌రు త‌మ ద‌గ్గ‌రే ఉంచార‌ని.. అందుకే రాజ‌ధాని భూముల్లో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం వాదించిన.. వాదిస్తున్న విష‌యం తెలిసిందే. అసెంబ్లీలోనూ దీనిపై రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ కూడా జ‌రిగింది. క‌మిటీల‌ను కూడా వేశారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ భూములు కొన్నార‌నే మిష‌తో.. కొంద‌రిపై హైకోర్టులోనూ కేసులు దాఖ‌ల‌య్యాయి.

ఇలాంటి కేసుల్లో ఒక దానిని తాజా హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొందరు అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారని పేర్కొంటూ.. హైకోర్ట‌లో కేసు దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం.. ఇరు ప‌క్షాల వాద‌నలు విన్న‌ది. ఈ క్ర‌మంలో భూములు అమ్మినవారు ఎవరు ఫిర్యాదు చేయలేదని, కేసు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమ్ముకున్న వారు ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని ఆయ‌న తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ అంశంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదని విచారణ అనంతరం హైకోర్టు పేర్కొంది. ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని ధర్మాసనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. ప్ర‌భుత్వానికి ఈ ప‌రిణామం భారీ దెబ్బేన‌ని అంటున్నారు నిపుణులు.

Satya

Recent Posts

సాయిపల్లవి వదులుకుంటే సమంత అందుకుంది

జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…

47 minutes ago

అక్కడ తోటి పిల్లలే టీచర్లు…

ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…

3 hours ago

ఒకే సినిమాలో 200 పాటలు

తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…

3 hours ago

ఉప్పెనకు ప్లస్సు… పెద్దికదే మైనస్సు

సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… మోడీ స‌మీక్ష‌?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) ఉద్య‌మ సంఘం నాయ‌కుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫ‌లించింది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల…

6 hours ago

మ‌మ‌త శ‌ప‌థం: అసెంబ్లీలో అడుగు పెట్ట‌ను.. !

ఇటీవ‌ల జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భ‌వానీ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ప‌రా జ‌యం పాలైన…

6 hours ago