Political News

వైసీపీ స‌ర్కారుకు షాక్‌: ఇన్‌సైడర్ ట్రేడింగ్ తూచ్.. కేసు కొట్టేసిన హైకోర్ట్‌

రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున ప్ర‌చారం చేసిన రాజ‌ధాని భూముల ఇన్‌సైడెర్ ట్రేడింగ్ తూచ్ యేనా? ఈ ఆరోప‌ణ‌లు కేవ‌లం రాజ‌కీయ‌మేనా? ముఖ్య‌మంత్రి నుంచి మంత్రుల వ‌ర‌కు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వ‌రకు చేసిన ఆరోప‌ణ‌లన్నీ డొల్లేనా? అన్నీ నిరాధారాలేనా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నా యి. ప్ర‌పంచంలో అతి పెద్ద‌న‌గ‌రంగా. అత్యంత ప్ర‌భావిత‌మైన రాజ‌ధానిగా ఉంటుంద‌ని భావించి గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దూర‌దృష్టితో నిర్ణ‌యించి.. శంకుస్థాప‌న చేసిన ఆంధ్రుల దేవ‌భూమి.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అనేక వాద‌న‌లు తెర‌మీదికి తెచ్చింది.

దీనిలో ప్ర‌ధాన‌మైంది.. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని. అమ‌రావ‌తి ఎక్క‌డ ఏర్ప‌డుతుందో ముందుగానే త‌న వారికి లీక్ చేయ‌డం వ‌ల్ల చంద్ర‌బాబు మ‌నుషులు.. రాజ‌ధాని ప్రాంత‌లో రైతుల‌ను మ‌భ్య‌ప‌రిచి.. భూముల‌ను అతిత‌క్కువ‌కు కొనేసి.. త‌ర్వాత రాజ‌ధాని భూముల స‌మీక‌ర‌ణ‌లో భారీ మొత్తాల‌కు ప్ర‌భుత్వానికి విక్ర‌యించార‌ని.. కొంద‌రు త‌మ ద‌గ్గ‌రే ఉంచార‌ని.. అందుకే రాజ‌ధాని భూముల్లో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం వాదించిన.. వాదిస్తున్న విష‌యం తెలిసిందే. అసెంబ్లీలోనూ దీనిపై రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ కూడా జ‌రిగింది. క‌మిటీల‌ను కూడా వేశారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ భూములు కొన్నార‌నే మిష‌తో.. కొంద‌రిపై హైకోర్టులోనూ కేసులు దాఖ‌ల‌య్యాయి.

ఇలాంటి కేసుల్లో ఒక దానిని తాజా హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొందరు అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారని పేర్కొంటూ.. హైకోర్ట‌లో కేసు దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం.. ఇరు ప‌క్షాల వాద‌నలు విన్న‌ది. ఈ క్ర‌మంలో భూములు అమ్మినవారు ఎవరు ఫిర్యాదు చేయలేదని, కేసు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమ్ముకున్న వారు ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని ఆయ‌న తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ అంశంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదని విచారణ అనంతరం హైకోర్టు పేర్కొంది. ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని ధర్మాసనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. ప్ర‌భుత్వానికి ఈ ప‌రిణామం భారీ దెబ్బేన‌ని అంటున్నారు నిపుణులు.

This post was last modified on January 19, 2021 1:51 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

7 hours ago