రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసిన రాజధాని భూముల ఇన్సైడెర్ ట్రేడింగ్ తూచ్ యేనా? ఈ ఆరోపణలు కేవలం రాజకీయమేనా? ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకు చేసిన ఆరోపణలన్నీ డొల్లేనా? అన్నీ నిరాధారాలేనా? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నా యి. ప్రపంచంలో అతి పెద్దనగరంగా. అత్యంత ప్రభావితమైన రాజధానిగా ఉంటుందని భావించి గత ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో నిర్ణయించి.. శంకుస్థాపన చేసిన ఆంధ్రుల దేవభూమి.. అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కారు అనేక వాదనలు తెరమీదికి తెచ్చింది.
దీనిలో ప్రధానమైంది.. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని. అమరావతి ఎక్కడ ఏర్పడుతుందో ముందుగానే తన వారికి లీక్ చేయడం వల్ల చంద్రబాబు మనుషులు.. రాజధాని ప్రాంతలో రైతులను మభ్యపరిచి.. భూములను అతితక్కువకు కొనేసి.. తర్వాత రాజధాని భూముల సమీకరణలో భారీ మొత్తాలకు ప్రభుత్వానికి విక్రయించారని.. కొందరు తమ దగ్గరే ఉంచారని.. అందుకే రాజధాని భూముల్లో భారీ కుంభకోణం జరిగిందని ప్రభుత్వం వాదించిన.. వాదిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలోనూ దీనిపై రోజుల తరబడి చర్చ కూడా జరిగింది. కమిటీలను కూడా వేశారు. ఇక, ఈ క్రమంలోనే ఇక్కడ భూములు కొన్నారనే మిషతో.. కొందరిపై హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి.
ఇలాంటి కేసుల్లో ఒక దానిని తాజా హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్తో పాటు మరికొందరు అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారని పేర్కొంటూ.. హైకోర్టలో కేసు దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు పక్షాల వాదనలు విన్నది. ఈ క్రమంలో భూములు అమ్మినవారు ఎవరు ఫిర్యాదు చేయలేదని, కేసు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమ్ముకున్న వారు ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని ఆయన తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ అంశంలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని విచారణ అనంతరం హైకోర్టు పేర్కొంది. ఇన్సైడ్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని ధర్మాసనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. ప్రభుత్వానికి ఈ పరిణామం భారీ దెబ్బేనని అంటున్నారు నిపుణులు.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…