ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, దానితో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ముఖ్యంగా యూజర్ల భద్రత విషయంలో ఏఐకి కొన్ని రూల్స్ అవసరమని తెలిపారు. కొత్త టెక్నాలజీని అడ్డుకోవడం కాకుండా, దానిని సురక్షితంగా ఉపయోగించేలా చూడాల్సిన అవసరం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
ఏఐ విషయంలో రెగ్యులేషన్ అవసరమా అనే ప్రశ్నకు కూడా వైష్ణవ్ స్పందించారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రయోజనాలతో పాటు కొత్త సమస్యలు కూడా వస్తాయని చెప్పారు. అందుకే రెగ్యులేషన్కు కూడా ఒక పాత్ర ఉంటుందన్నారు. యూజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, టెక్నాలజీ అభివృద్ధికి ఇబ్బంది రాకుండా చూడాలన్నది కేంద్రం ఆలోచనగా తెలిపారు.
ఇప్పటికే ఏఐతో తయారయ్యే ఫేక్ వీడియోలు, ఫొటోలు, వాయిస్లు సమస్యగా మారుతున్నాయి. ఒక వ్యక్తి మాట్లాడని మాటలను కూడా అతని వాయిస్లోనే చెప్పించగల పరిస్థితి ఉంది. ప్రముఖుల పేరుతో డీప్ఫేక్ వీడియోలు తయారు చేసి మోసాలకు ఉపయోగించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐతో తయారైన కంటెంట్ విషయంలో కేంద్రం ఇప్పటికే కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది.
ఫిబ్రవరిలో ఐటీ రూల్స్లో మార్పులు చేసి ఏఐతో తయారైన కంటెంట్ను గుర్తించేలా లేబులింగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించిన సమాచారం మెటాడేటాలో కూడా ఉండాలి. చట్టవిరుద్ధమైన ఏఐ కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు కూడా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మరిన్ని రూల్స్ అవసరమా అనే విషయంపై ప్రభుత్వం టెక్ కంపెనీలతో చర్చిస్తోంది. ప్రస్తుతం భారత్లో ఏఐ కోసం ప్రత్యేకంగా ఒకే చట్టం లేదు. ఐటీ చట్టం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంతో పాటు ఇతర నిబంధనలు కొన్ని అంశాలకు వర్తిస్తున్నాయి. ఏఐ అభివృద్ధికి అడ్డుకాకుండా యూజర్ల భద్రత కోసం ఎలాంటి కొత్త రూల్స్ తీసుకొస్తారన్నది ఇప్పుడు చూడాలి.
This post was last modified on September 18, 2026 9:50 am
డిసెంబర్ లో ఫౌజీ రావడం లేదని ఏ క్షణాన లీకయ్యిందో కానీ అప్పటి నుంచి ఆ స్లాట్ కోసం రకరకాలుగా…
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఒక విషయాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి. తన…
ఆరు నెలల క్రితం హత్యకు గురైన ప్రముఖ యూ ట్యూబర్ వైషు అమ్మ ఫేమ్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు…
దేశంలో రోజురోజుకో రకమైన దారుణం జరుగుతుంది. ఊహించని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కరుడుగట్టిన నేరస్తులు సైతం విస్తుపోయే విధంగా నేరాల…
కొన్నేళ్లుగా భారత్ లో బ్యాన్ ఎదుర్కొంటున్న టిక్ టాక్ గుర్తింది కదా? ఇప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఆసియాలోనే అత్యంత…
వైసీపీ అరాచక పాలనకు తెరదించేందుకు 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడిందని…