Political News

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా `విజ‌న్‌`… బాబు సూప‌ర్ ప్లాన్‌!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూప‌ర్ ప్లాన్ వేశారు. ఇప్ప‌టి వ‌రకు రాష్ట్రం, జిల్లాల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసిన `విజ‌న్‌`ను ఇక నుంచి నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. వాస్త‌వానికి గ‌తం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా సీఎం చంద్ర‌బాబు ప‌దేళ్ల ముంద‌టి భ‌విష్య‌త్తును అంచ‌నా వేసి.. దాని ప్ర‌కారం విజ‌న్‌ను రెడీ చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో `విజ‌న్‌-2020` ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత‌.. `స్వ‌ర్ణాంధ్ర-2040` తాజాగా `స్వ‌ర్ణాంధ్ర‌-2047` అమ‌లుకు శ్రీకారం చుట్టారు. అలానే జిల్లాల‌కు కూడా ప్ర‌త్యేక విజ‌న్ ఉండాల‌ని నిర్ణ‌యించారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా విజ‌న్‌ను అమ‌లు చేయాల‌ని నిర్దేశించారు. పార్టీ ఎమ్మెల్యేల‌తో నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో శుక్ర‌వారం రాత్రి పాల్గొన్న చంద్ర‌బాబు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, కూట‌మి ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ముఖ్యంగా ప్ర‌జ‌ల‌ను ఈ ఎన్నిక‌ల విష‌యంలో ఏవిధంగా ఆక‌ట్టుకోవాలి? అనే అంశాల‌పై స్ప‌ష్ట‌మైన దిశానిర్దేశం చేశారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రం-జిల్లాల‌తో పాటు.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూడా విజ‌న్ ఏర్పాటు చేసుకుని దానిని సాధించే దిశ‌గా అడుగులు వేయాల‌న్నారు. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాలు విజ‌న్‌పైనే దృష్టి పెట్టాల‌న్నారు.

ఏం చేస్తారు?

రాష్ట్రానికి సంబంధించి విజ‌న్ ఉన్న‌ట్టుగానే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూడా.. ప‌దేళ్లకు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు, స్థానికంగా జ‌నాభాను పెంచ‌డం, ఉపాధి, ఉద్యోగాలు వంటి అంశాల‌తో ప్ర‌త్యేక విజ‌న్‌ను రెడీ చేసుకోవాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఇదే స‌మ‌యంలో ర‌హ‌దారులు, ప్రాజెక్టులు, తాగునీటి క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాల‌న్నారు. అలానే వ‌చ్చే 10 సంవ‌త్స‌రాల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అవ‌స‌రాలు కావాలి.. ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన సౌక‌ర్యాల‌పై రోడ్ మ్యాప్ రెడీ చేసుకుని ఎమ్మెల్యేలు స‌న్నద్ధం కావాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.

మ‌ళ్లీ మ‌న‌మే!

మ‌ళ్లీ కూట‌మి పాల‌నే రాష్ట్రంలో వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు భ‌రోసా వ్య‌క్తం చేశారు. కొంద‌రు ఎమ్మెల్యేలు దీనిపై నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌ని .. పార్టీ అధిష్టానంపై ఆధార‌ప‌డ‌డం కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నించాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ కాకుండా.. పార్టీనే అన్నీ చూసుకుంటుంద‌ని భావిస్తే క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌మే వ‌స్తున్నామ‌న్న ధీమా మంచిదే అయినా.. ఆమేరకు ప్ర‌జ‌ల‌ను మ‌న‌వైపు తిప్పుకొనేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. “మ‌నం ఒక రాక్ష‌స మూక‌తో యుద్ధం చేస్తున్నామ‌న్న విష‌యాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాలి.“ అని సూచించారు. 

This post was last modified on September 5, 2026 8:31 am

Share

Recent Posts

తెలంగాణాలో ఇది మూడో బర్తరఫ్

తెలంగాణాలో కొండా సురేఖ నుమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం, తదుపరి పరిణామాల గురించి హాట్ హాట్ గా చర్చలు…

43 minutes ago

గాయం మీద కారం చల్లిన కొత్త టాక్సిక్

కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల ఫలితాలు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత గుర్తుకొస్తుంది. గత వారం విడుదలైన…

2 hours ago

మ‌ణిర‌త్నం మ్యాజిక్ చూడ‌బోతున్నామా?

ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే గ్రేటెస్ట్ డైరెక్ట‌ర్ల‌లో మ‌ణిర‌త్నం ఒక‌రు. భాషా భేదం లేకుండా దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు భారీ అభిమాన గ‌ణం…

3 hours ago

హడావిడి లేకుండా 100 కోట్లు లాగేసింది

చిన్న మూవీ, అందులోనూ కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తీశారు. పైగా డివోషనల్ బ్యాక్ గ్రౌండ్. ఎంత దేవుడి…

5 hours ago

టాక్సిక్ వ‌ల్లే కాలేదు… వీటి వ‌ల్ల‌వుతుందా?

టాలీవుడ్ గత పుష్క‌ర కాలంలో పాన్ ఇండియా స్థాయిలో బాహుబ‌లి, పుష్ప లాంటి అసాధార‌ణ విజ‌యాల‌ను చూసింది. కానీ ఇప్పుడు…

7 hours ago

`కోటి ఇళ్లు` చుట్టేశారు.. స‌రే.. ల‌క్ష్యం నెరవేరిన‌ట్టేనా?!

`ఇంటింటికీ టీడీపీ` పేరుతో ఏపీ అధికార కూట‌మి పార్టీ టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం స‌రికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మ‌రో…

9 hours ago