త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ లోకల్ వార్ లో ఫైట్ కు ఇటు కూటమి పార్టీలు..అటు వైసీపీ రెడీ అవుతున్నాయి. అయితే, ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గంలో అక్కడి వైసీపీ ఇంఛార్జ్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ పై సొంత పార్టీలో సైతం విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణ స్పందించారు.
ఊళ్లలో వైసీపీ హయాంలోనూ ఏకగ్రీవాలు జరిగాయని, ఇప్పుడు కూడా జరుగుతాయని బొత్స చెప్పారు. అయితే, అవి ప్రభుత్వాలు చేసే ఏకగ్రీవాలు అని, పార్టీల పరంగా, రాజకీయ లబ్ధి కోసం ఏకగ్రీవాలు జరగకూడదని జగన్ చెప్పారని స్పష్టం చేశారు.
ఊరు అభివృద్ధి కోసం జరిగే ఏకగ్రీవాలు, రాజకీయపరంగా లాలూచీ పడే ఏకగ్రీవాలు..ఇవి రెండూ వేరని అన్నారు. అధికార పార్టీ ప్రలోభ పెట్టి, వ్యవస్థలను, పోలీసులను అడ్డుపెట్టుకొని జరిపే ఏకగ్రీవాలకు వైసీపీ వ్యతిరేకం అని చెప్పారు. వాటికి భయపడకూడదని, పోరాడాలని జగన్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అని తెలిపారు.
వాస్తవానికి, వైసీపీ హయాంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ భయపెట్టి, లాలూచి పడి చేసినవేనని విమర్శలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులను గదుల్లో పెట్టి తాళాలు వేసి నామినేషన్ వేయకుండా చేసిన ఘటనలు కోకొల్లలు. అటువంటిది, ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు జరగకూడదు అని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుంది అన్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు.
This post was last modified on August 30, 2026 7:00 pm
హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ చాలా కొద్దిమందే సంపాదించుకుంటారు. నయనతార ఆ కోవకే చెందుతుంది. సౌత్ ఇండియాలో తనకంటే వయసు…
విజయ్ దేవరకొండ ఈ రోజు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా నిలబడ్డాడంటే.. పాన్ ఇండియా స్థాయిలో అతడికి మంచి…
ఒక భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక.. ఆ సక్సెస్ను నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అసాధారణమైన…
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ళ క్రితం ఏ ముఖ్యమంత్రి అయితే వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారో…
ఇరుముడి ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఇద్దరికీ మాత్రం దాని వల్ల పూర్తి ప్రయోజనం దక్కలేదని చెప్పాలి. మొదటి పేరు…
బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ ఎదురీదుతున్న వైనం ఒకవైపు, కావాలని కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని కన్నడ మూవీ లవర్స్ కొందరు…