ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారు. డబుల్ బెడ్ రూం లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు. నిన్నటి వరకు కొండా సురేఖ, చిన్నా రెడ్డి తలనొప్పితో అధికార పార్టీ కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళుతున్న సమయంలో దానం నాగేందర్ ఎపిసోడ్ జరగడం చర్చనీయాంశంగా మారింది. దానం ఎందుకు అలిగి పోయారంటే….
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సింది. అయితే ఆయన రాకుండానే అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. అధికారుల తొందరపాటు ఇప్పుడు సమస్యగా మారింది. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని దానం అనుచరులు మండి పడ్డారు. ఎమ్మెల్యే హాజరు కావట్లేదని మీకు ఎవరైనా సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించిన కార్యకర్తలకు జవాబు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు.
తనకు సరైన ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లి పోయారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయం అటు అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని బయట పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రజా ప్రతినిధులను గౌరవించాలన్న కనీస మర్యాదను అధికారులు పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్యక్రమం నుంచి వెళ్లి పోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పుడేమి చేస్తారన్న దానిమీద అధికారులు, అధికార పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ నిబంధనలు పాటించని అధికారులపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
This post was last modified on August 29, 2026 5:32 pm
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల ఇంకో ముప్పై రెండు రోజుల్లో…
గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి జోష్ మీద నడుస్తోంది. కనీసం రెండు వారాలకో మంచి సినిమా పడుతోంది.…
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. తనకు రాజకీయ పునాదులు వేసిన వైసిపి పార్టీలో జరిగిన…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్నాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దే బసంతి, 3…
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతుంది. వైసీపీ అధికారం కోల్పోయి కూడా రెండున్నరేళ్ళయ్యింది. అయినా ఇప్పటికీ వైసీపీ కోలుకోలేదు. ఓటమికి…
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…