చివరకు కోడిపుంజులే గెలిచాయి. ప్రతిఏటా సంక్రాంతి సందర్భంగా జరుపుకునే కోళ్ళపందేలను ఈసారి ఎలాగైనా అడ్డుకోవాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. దానికి తగ్గట్లే హైకోర్టు కూడా కోళ్ళపందేలు జరగకుండా చూడమని పోలీసులను గట్టిగా హెచ్చరించటంతో ఈసారి కోడిపందేలు అనుమానమేనా అనిపించింది. కానీ పండుగ మొదటిరోజైన భోగిపండుగ నాడు యధావిధిగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ళపందేలు మొదలయ్యాయి. మొదటిరోజే సుమారు రూ. 100 కోట్లు పందెంలో భాగంగా చేతులు మారినట్లు సమాచారం.
ఇక్కడ పోలీసులైనా, కోర్టులైనా గ్రహించాల్సింది ఒకటుంది. అదేమిటంటే తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఎలా జరుగుతాయో ఏపిలో కోళ్ళపందేలు అలాగే జరుగుతాయి. కోళ్ళపందేలు జరపటమన్నది చాలా ఊర్లలో పెద్ద ప్రిస్టేజి యవ్వారం. గ్రామాల్లో మోతుబరులింతమంది ఉండి కూడా కోళ్ళపందేలు జరపలేకపోయారంటే దాన్ని వాళ్ళంతా చాలా అవమనాంగా భావిస్తారు. అందుకనే కోళ్ళపందేలకు చాలా ముందునుండే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటారు. భోగిపండుగ రోజు మొదలైన పందేల్లో వైసీపీ ఎంపిలు లావు శ్రీకృష్ణదేవరాయులు, వల్లభనేని బాలశౌరి లాంటి అనేకమంది ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలను ప్రారంభించారు.
మోతుబర్లు, పందెం రాయళ్ళు కలిసే పందేలకు అవసరమైన బరులను సిద్ధం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కోళ్ళపందేల విషయంలో అధికారపార్టీ, ప్రతిపక్షమనేది ఉండదు. రాజకీయ నేతలంతా కలిసిపోయి పందేలు నిర్వహిస్తారు కాబట్టే పోలీసులు కూడా ఎవరినీ ఏమీ చేయలేకపోతున్నారు. ఇపుడు కుక్కునూరు మండలంలోని ఏలేరు, నిడదవోలు మండలంలోని సింగవరం, తాడిమళ్ళ, భీమవరం మండలంలోని వెంప, కాళ్ళమండలంలోని సీసలి గ్రామాల్లో పెద్దఎత్తున కోళ్ళపందేలు మొదలైపోయాయి. అనపర్తి, రాజోలు, పాశవరం, ఏలూరు లాంటి ప్రాంతాల్లో కూడా పందేలు జరిగయి.
ప్రజాసంకల్పం ముందు పోలీసులైనా, కోర్టులైనా చేయగలిగేది ఏమీ ఉండదన్నది వాస్తవం. మెజారిటి ప్రజలు కోళ్ళపందేలను కోరుకుంటున్నపుడు కోర్టులు, పోలీసులు చేయగలిగేది ఏమీ లేదన్నది తాజాగా మరోసారి నిరూపణైంది. కాబట్టి కోళ్ళపందేల నిర్వహణ విషయంలో కోర్టులు, పోలీసులు పట్టించుకోకపోవటమే ఉత్తమం అన్నట్లుగా ఉంది క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు.
This post was last modified on January 14, 2021 12:16 pm
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…