హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు కబ్జా చేసిన కట్టిన కట్టడాల కూల్చివేతలు కరెక్టేనని సమర్థిస్తున్నారు. ఇక, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కోర్టు కూడా పలుమార్లు చివాట్లు పెట్టింది. అయినా సరే, తగ్గేదేలే అని ఆయన ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు గచ్చిబౌలిలో ఏడంతుస్తుల భవనం కూలిన ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రంగనాథ్.
50 గజాల స్థలంలో బిల్డర్ సాజిద్ ఏడంస్తుల భవనం కట్టారని, దీనికి సెట్ బ్యాక్ లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఆయన కట్టిన ఈ తరహా బిల్డింగులు అనేకం ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించి త్వరలోనే కూల్చివేస్తామని సంచలన ప్రకటన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలన్నింటినీ కూల్చివేయక తప్పదని స్పష్టం చేశారు.
ఇక, ఈ ప్రాంతంలో చాల నివాస భవనాలను హాస్టల్స్ కు ఉపయోగిస్తున్నారని, వాటిని ఖాళీ చేయాలని యజమానులకు చెబుతామని అన్నారు. ఆ బిల్డింగ్ కుప్పకూలని అంజయ్య నగర్ లో నాలాను ఆక్రమించి ఇష్టారీతిన బిల్డింగులు కట్టారని, ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కూల్చివేయాల్సిన భవనాలను గుర్తిస్తామని తెలిపారు.
This post was last modified on August 22, 2026 8:19 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…