హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు కబ్జా చేసిన కట్టిన కట్టడాల కూల్చివేతలు కరెక్టేనని సమర్థిస్తున్నారు. ఇక, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కోర్టు కూడా పలుమార్లు చివాట్లు పెట్టింది. అయినా సరే, తగ్గేదేలే అని ఆయన ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు గచ్చిబౌలిలో ఏడంతుస్తుల భవనం కూలిన ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రంగనాథ్.
50 గజాల స్థలంలో బిల్డర్ సాజిద్ ఏడంస్తుల భవనం కట్టారని, దీనికి సెట్ బ్యాక్ లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఆయన కట్టిన ఈ తరహా బిల్డింగులు అనేకం ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించి త్వరలోనే కూల్చివేస్తామని సంచలన ప్రకటన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలన్నింటినీ కూల్చివేయక తప్పదని స్పష్టం చేశారు.
ఇక, ఈ ప్రాంతంలో చాల నివాస భవనాలను హాస్టల్స్ కు ఉపయోగిస్తున్నారని, వాటిని ఖాళీ చేయాలని యజమానులకు చెబుతామని అన్నారు. ఆ బిల్డింగ్ కుప్పకూలని అంజయ్య నగర్ లో నాలాను ఆక్రమించి ఇష్టారీతిన బిల్డింగులు కట్టారని, ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కూల్చివేయాల్సిన భవనాలను గుర్తిస్తామని తెలిపారు.
This post was last modified on August 22, 2026 8:19 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…