జగన్ కేబినెట్లో ఇతర మంత్రుల పరిస్థితి ఎలా ఉన్నా.. ఒకరిద్దరు మంత్రులకు క్లీన్ ఇమేజ్ ఉంది. వారు సంచలన వ్యాఖ్యలు చేయరు.. పనిమాత్రమే చేస్తారు! అనే సంపాయించుకున్నారు. అంతేకాదు.. వారు మంత్రి పదవి ఉందికదా అని దూకుడుగా కూడా ఉండరు. ఎక్కడ ఎంతవరకు వ్యవహరించాలో.. అక్కడ అంతవరకు పనిచేసి.. క్లీన్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇటు ప్రభుత్వంలోను, అటు తమ జిల్లాలోనూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారు ఒకరిద్దరే ఉంటే.. వారిలోనూ ముందున్నారు.. నెల్లూరు జిల్లాకుచెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. జగన్కు అత్యంత సన్నిహితమైన నాయకుల్లో ఈయన ఒకరు. అంతేకాదు.. మౌనంగా ఉంటూ.. ప్రతి విషయంలోను ఆచి తూచి వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు. వైసీపీ సర్కారు ఏర్పడి ఏడాదిన్నర గడిచిపోయినా.. ఎందరో మంత్రులు సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. గౌతంరెడ్డి మాత్రం ఏనాడూ.. ఇలాంటి వాటి జోలికి పోలేదు. దీంతో మా మంచి మంత్రిగా ఆయన నియోజకవర్గంలో పేరు సంపాయించుకున్నారు.
అయితే.. ఆయన ఒక్కసారిగా అన్ పాపులర్ అయిపోయారని అంటున్నారు పరిశీలకులు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాన్.. తూర్పుగోదావరి జిల్లా దివీస్ విషయంపై గళం వినిపించారు. 15 గ్రామాలకు చెందిన వేల మంది ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వారికి దన్నుగా నిలిచి.. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో ఆందోళన కారులను అరెస్టు చేయడం దారుణమని.. ముందుగా వారిని విడిచిపెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గౌతంరెడ్డి పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా కామెంట్లు చేశారు.
దివీస్కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని.. అప్పట్లో ఏం చేశారని.. ఎదరుప్రశ్నించారు. ఇక, పంచాయతీ ఎన్నికలపై పవన్ తన మనసులో మాట చెప్పాలని అన్నారు. నిజానికి సమస్యను ఈ వ్యాఖ్యలు పక్కదారి పట్టించాయి. ఇతర మంత్రులు, లేదా నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే మంత్రులు ఇలా మాట్లాడి ఉంటే.. వేరేగా ఉండేదని, కానీ, క్లీన్ ఇమేజ్ ఉన్న ఉన్నత విద్యావంతుడైన గౌతంరెడ్డి ఇలా వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు పరిశీలకులు. ఆయన మౌనంగా ఉన్నా.. సరిపోయేదని అంటున్నారు.
This post was last modified on January 13, 2021 10:34 pm
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…
న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు…