Political News

అజ్ఞాత వ్యక్తి ఎవరో ఉన్నారు.. సునీత అనుమానం!

త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డిని దారుణంగా చంపేసిన వాళ్లు ఫ‌స్ట్ ఫ‌స్ట్ ఆ విష‌యాన్ని జ‌గ‌న్‌కే చెప్పార‌ని అందుకే జ‌గ‌న్‌పై త‌న‌కు అనుమానం ఉంద‌ని వివేకా కుమార్తె డాక్ట‌ర్ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌లేద‌న్నారు. దీని వెనుక అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో చ‌క్రం తిప్పుతున్నార‌ని విచార‌ణ‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని సందేహం వ్య‌క్తం చేశారు. అందుకే ప‌దే ప‌దే కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు.

అయిన‌ప్ప‌టికీ కోర్టుల్లోనూ త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని సునీత తెలిపారు. అయినా త‌న‌కు న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంద‌ని త‌న తండ్రిని చంపిన అస‌లు దోషుల‌పై కేసులు పెట్టేవ‌ర‌కు వారిని జైలుకు పంపేవ‌ర‌కు విశ్ర‌మించేది లేద‌న్నారు.

కాగా శ‌నివారం వివేకానంద‌రెడ్డి 75వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆమె క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు వ‌చ్చారు. ఇక్క‌డి వివేకా స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించారు. అనంత‌రం ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“మా నాన్న కేసు విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యం ఇప్పుడుకాదు గ‌తంలోనూ చెప్పాను. కోర్టుకు కూడా విన్న‌వించాను. అయినా స‌రిగా విచార‌ణ చేయ‌డం లేదు. దీనివెనుక ఎవ‌రో ఉన్నారు. ఆ ఎవ‌ర‌నేది అంద‌రికీ తెలిసిందే. ఆ విష‌యాన్ని సీబీఐ అధికారులు చెప్పాలి. వారిపై కేసులు న‌మోదు చేయాలి. వారిని విచారించాలి. అప్ప‌టి వ‌ర‌కు విశ్ర‌మించ‌ను. ఈ కేసు విచార‌ణ తుది చార్జిషీట్‌ను కోర్టులో దాఖ‌లు చేశామ‌ని సీబీఐ చెబుతోంది. కానీ ఇక్క‌డితో అయిపోలేదు” అని సునీత వ్యాఖ్యానించారు.

2019 మార్చిలో వివేకానంద‌రెడ్డిని పులివెందుల‌లోని ఆయ‌న నివాసంలోనే దారుణంగా హ‌త‌మార్చారు. అప్ప‌టి నుంచి ఈ కేసు విచార‌ణ జ‌రుగుతూనే ఉంది. అయితే వైసీపీ హ‌యాంలో సాక్షుల‌ను బెదిరించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అదేవిధంగా సీబీఐ అప్ప‌టి డీఎస్పీ రాంసింగ్‌పైనే వైసీపీ నాయ‌కులు కేసులు పెట్టారు.

ఇలా అనేక మ‌లుపులు తిరిగిన ఈ కేసులో సీబీఐ విచార‌ణ పూర్త‌యింద‌ని ప‌దే ప‌దే చెబుతోంది. అయితే “అస‌లు నిందితుల‌ను” వ‌దిలేశార‌న్న‌ది సునీత ఆవేద‌న‌.

This post was last modified on August 8, 2026 4:39 pm

Share

Recent Posts

సెంటిమెంటుతో వర్కవుట్ కావట్లేదా కవిత గారు?

తెలంగాణ రక్ష‌ణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్న మాజీ ఎంపీ, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత‌.. ఇప్పుడు…

1 hour ago

కనకం కురిపిస్తున్న కొరియన్ దెయ్యం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్ద రిలీఫ్ ఫీలవుతున్నాడు. వరస డిజాస్టర్లతో ఏకంగా కెరీర్ నే రిస్క్ లో పెట్టుకున్న…

1 hour ago

మహేష్ అభిమానులకు దూకుడే దిక్కు

రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. అభిమానులు ఎప్పటిలాగే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఎలాగూ…

1 hour ago

డీఎస్సీపై వైసీపీది అక్క‌సే… క‌దిలిన టీచ‌ర్లు!

కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు గ‌త ఏడాది మెగా డీఎస్సీ-2025ను నిర్వ హించి 16 వేల…

1 hour ago

5 స్టార్ హోటళ్లలో కుళ్లిన మాంసం..

ఇంటికంటే గుడి పదిలం అన్నది పాత సామెత. ఇంటి తిండి కంటే హోటల్ తిండే బెటర్ అనేది నేటి ట్రెండ్.…

2 hours ago

తమన్ ఆ జోక్‌నే నిజం చేశాడే

టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు తమన్. తెలుగులో దాదాపుగా అందరు టాప్ స్టార్లతో అతను…

2 hours ago