Political News

లోకేష్‌కు షాక్ అనుకున్నారు.. కానీ!

టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు నిరసనగా అంగన్‌వాడీ కార్యకర్తలు.. రహదారులపై వచ్చారని, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా.. తల్లికి వందనం నిధుల గురించేనని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు.

గత ఎన్నికలకు ముందు వైసీపీ అమ్మ ఒడి పథకం అమలు చేసిందని.. ఆ సమయంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్.. అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా తాము వచ్చాక తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, తాజాగా తల్లికి వందనం పథకంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సొమ్ములు ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే పెనమలూరు పర్యటనలో మహిళలు రోడ్డెక్కారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. అన్యాయం చేసింది తాము కాదని.. వైసీపీనేనని ఆయన ఆరోపించారు.

వైసీపీ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు అమ్మఒడి ఇవ్వకుండా అన్యాయం చేసింది గొడ్డలి పార్టీ. కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడంతో సంతోషంతో వారు నా పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేసిన గొడ్డలి పార్టీ… అంగన్‌వాడీల ఈ కృతజ్ఞత ర్యాలీని, నిరసన ర్యాలీ అంటూ విష ప్రచారం చేస్తోంది. అని ఎద్దేవా చేశారు.

అడ్డంగా బుక్కయిన వైసీపీ

వాస్తవానికి పెనమలూరులో ఏం జరిగిందన్న విషయం ఆసక్తిగా మారింది. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్లకార్డులు పెట్టుకుని రోడ్లపై ఉన్న మాట నిజం. అయితే.. అది తల్లికి వందనం నిధులు జమ కోసం కాదు. ఎందుకంటే.. అప్పటికే ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చి అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

కానీ.. పెనమలూరులో మహిళలు.. తమ వేతనాలు పెంచాలని.. గత 5 ఏళ్లలో తమ వేతనాలు పెరగలేదని చెప్పేందుకు వచ్చారు. అయితే.. ఈ విషయం వైసీపీ వేరే కోణంలో చూపించి.. విమర్శల దాడి చేసి బుక్కయిపోయింది.

This post was last modified on July 28, 2026 2:33 pm

Share

Recent Posts

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

10 minutes ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

7 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

8 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

9 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

10 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

12 hours ago