లాక్ డౌన్ కారణంగా జనాలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో.. పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. తిండికి కూడా కష్టమై సాయం చేసే చేతుల కోసం ఎదురు చూశాయి ఎన్నో కుటుంబాలు. వారికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో ప్రయత్నించాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలూ ఆర్థిక సాయం అందించాయి. రేషన్ కూడా ఇచ్చాయి. ఇంకా పలు రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇప్పటికే నెలన్నర రోజులు అతి కష్టం మీద గడవగా.. ఇంకా కొన్నాళ్ల పాటు ఈ కష్టాల్ని తట్టుకోక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న మద్యం దుకాణాలు తెరుచుకుంటే ఎలా జనాలు ఎగబడ్డారో అందరూ చూశారు.
నిన్నటి వరకు తిండికి కష్టపడ్డట్లు చెప్పుకున్న వాళ్లలో చాలామంది వైన్ షాపుల ముందు బారులు తీరారు. తిండికే డబ్బుల్లేని పరిస్థితి ఉంటే.. వీళ్లకు మందు కొట్టడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇలాంటి వాళ్లకు రేషన్ ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడంలో అర్థమేముందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో ఒక ఆసక్తికర ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. మద్యం దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఎన్నికల టైంలో వేసినట్లు వేలిపై ఇంక్ వేయాలని.. ఆ తర్వాత రేషన్, ఇతర సాయం అందించేటపుడు ఆ ఇంట్లో మగవాళ్లందరి వేళ్లు పరిశీలించి.. ఇంక్ లేని పక్షంలోనే సాయం చేయాలని.. ఇంక్ ఉన్నట్లయితే అన్ని రకాల సాయాలు ఆపేయాలని ప్రతిపాదిస్తున్నారు కొందరు నెటిజన్లు. దీనికి మంచి మద్దతే లభిస్తోంది.
ఇలాంటి కష్ట కాలంలో కూడా మద్యపానం అంత ముఖ్యమైనపుడు, దానికి డబ్బులున్నపుడు అలాంటి వాళ్లకు ట్యాక్స్ పేయర్ మనీ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న సహేతుకమైందే కదా?
This post was last modified on May 6, 2020 10:08 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…