Political News

ఏవీ సుబ్బారెడ్డిని స్టేషన్ కు తీసకెళ్లే టైంకు.. వారు అక్కడే ఉన్నారా?

సంచలనంగా మారిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ ఉదంతంలో ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని.. తర్వాత పోలీసులు విడిచిపెట్టటం తెలిసిందే. బుధవారం రాత్రి అయ్యప్ప సొసైటీలో మీడియా సమావేశాన్నినిర్వహించారు. మీడియా ప్రతినిధులతో ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నాప్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని.. పోలీసులు తన పేరును అనవసరంగా చేర్చారని పేర్కొన్నారు.

తనను ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నా వదిలేస్తారన్న వ్యాఖ్యను చేశారు. మీడియాతో మాట్లాడుతున్న వేళలోనే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను నేరుగా బేగంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఆయన్ను స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు వర్గానికి చెందిన వారు అక్కడే ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు ప్రశ్నలు వేసిన తర్వాత.. కిడ్నాప్ ఎపిసోడ్ లో ఆయనకు సంబంధం లేదని పోలీసులు నిర్దారణ కు వచ్చారు. అదే సమయంలో.. ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్ వర్గీయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఆయనకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాల్సిందిగా చెప్పి పంపించేశారని చెబుతున్నారు. అయితే.. ఏవీ సుబ్బారెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే బాధిత వర్గానికి చెందిన వారు ఉండటం ఆసక్తికరంగా మారింది. తొలుత ఫిర్యాదు చేసి.. గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవటాన్ని పలువురు అండర్ లైన్ చేయాలని చెబుతున్నారు. తొందరపాటుకు గురి కాకుండా పోలీసులు వ్యవహరించాలన్న సూచన కొందరి నుంచి వినిపించటం గమనార్హం.

This post was last modified on January 8, 2021 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

12 seconds ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

52 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago