సంచలనంగా మారిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ ఉదంతంలో ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని.. తర్వాత పోలీసులు విడిచిపెట్టటం తెలిసిందే. బుధవారం రాత్రి అయ్యప్ప సొసైటీలో మీడియా సమావేశాన్నినిర్వహించారు. మీడియా ప్రతినిధులతో ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నాప్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని.. పోలీసులు తన పేరును అనవసరంగా చేర్చారని పేర్కొన్నారు.
తనను ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నా వదిలేస్తారన్న వ్యాఖ్యను చేశారు. మీడియాతో మాట్లాడుతున్న వేళలోనే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను నేరుగా బేగంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఆయన్ను స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు వర్గానికి చెందిన వారు అక్కడే ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు ప్రశ్నలు వేసిన తర్వాత.. కిడ్నాప్ ఎపిసోడ్ లో ఆయనకు సంబంధం లేదని పోలీసులు నిర్దారణ కు వచ్చారు. అదే సమయంలో.. ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్ వర్గీయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో.. ఆయనకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాల్సిందిగా చెప్పి పంపించేశారని చెబుతున్నారు. అయితే.. ఏవీ సుబ్బారెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే బాధిత వర్గానికి చెందిన వారు ఉండటం ఆసక్తికరంగా మారింది. తొలుత ఫిర్యాదు చేసి.. గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవటాన్ని పలువురు అండర్ లైన్ చేయాలని చెబుతున్నారు. తొందరపాటుకు గురి కాకుండా పోలీసులు వ్యవహరించాలన్న సూచన కొందరి నుంచి వినిపించటం గమనార్హం.
This post was last modified on January 8, 2021 10:12 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…