Political News

ఏవీ సుబ్బారెడ్డిని స్టేషన్ కు తీసకెళ్లే టైంకు.. వారు అక్కడే ఉన్నారా?

సంచలనంగా మారిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ ఉదంతంలో ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని.. తర్వాత పోలీసులు విడిచిపెట్టటం తెలిసిందే. బుధవారం రాత్రి అయ్యప్ప సొసైటీలో మీడియా సమావేశాన్నినిర్వహించారు. మీడియా ప్రతినిధులతో ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నాప్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని.. పోలీసులు తన పేరును అనవసరంగా చేర్చారని పేర్కొన్నారు.

తనను ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నా వదిలేస్తారన్న వ్యాఖ్యను చేశారు. మీడియాతో మాట్లాడుతున్న వేళలోనే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను నేరుగా బేగంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఆయన్ను స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు వర్గానికి చెందిన వారు అక్కడే ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు ప్రశ్నలు వేసిన తర్వాత.. కిడ్నాప్ ఎపిసోడ్ లో ఆయనకు సంబంధం లేదని పోలీసులు నిర్దారణ కు వచ్చారు. అదే సమయంలో.. ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్ వర్గీయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఆయనకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాల్సిందిగా చెప్పి పంపించేశారని చెబుతున్నారు. అయితే.. ఏవీ సుబ్బారెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సమయానికే బాధిత వర్గానికి చెందిన వారు ఉండటం ఆసక్తికరంగా మారింది. తొలుత ఫిర్యాదు చేసి.. గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవటాన్ని పలువురు అండర్ లైన్ చేయాలని చెబుతున్నారు. తొందరపాటుకు గురి కాకుండా పోలీసులు వ్యవహరించాలన్న సూచన కొందరి నుంచి వినిపించటం గమనార్హం.

This post was last modified on January 8, 2021 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆది పినిశెట్టి… ఇలా జరిగిందేంటి

టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…

31 minutes ago

మసక మసక ఎలా ఉంది

ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…

57 minutes ago

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

2 hours ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

3 hours ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

4 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

7 hours ago