అప్పు తీసుకున్న వారికి ఓ శుభవార్త. అప్పు విషయంలో ఆందోళన పడకండి. చెల్లించడంలో సమస్యలు ఉంటే… మీకు కలిసి వచ్చే వార్త. కానీ సాంకేతికంగా చూస్తే ఒకింత సమస్యను సృష్టించేదే. ఇంతకీ విషయం ఏంటంటే… రుణాల చెల్లింపులపై మరో 3 నెలలపాటు మారటోరియంను ఆర్బీఐ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లాక్డౌన్ను మరికొంతకాలం కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో మారటోరియంను సైతం అదే రీతిలో పెంచాలన్న ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ గట్టిగా పరిశీలిస్తోంది. దీంతో రుణగ్రహీతలకు ఒత్తిడి తగ్గినట్లే.
కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. దీంతో అన్ని రకాల రుణాలపై ఈఎంఐ చెల్లింపులకు సంబంధించి మూడు నెలల వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల ఈఎంఐలపై మారటోరియం తీసుకునే వీలును రుణగ్రహీతలకు కల్పించాలని బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మార్చి 27న ఆర్బీఐ సూచించింది.
అయితే, ఈ నెల 31తో ఈ గడువు తీరిపోతోంది. ఇదే సమయంలో లాక్ డౌన్ను ఇటీవలే ఈ నెల 17దాకా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దీంతో అందరి చూపు మారటోరియంపై పడింది. భారతీయ బ్యాంకుల సంఘం సహా వివిధ వర్గాల నుంచి మారటోరియంను పొడిగించాలన్న విజ్ఞప్తులు ఆర్బీఐకి వస్తున్నాయి.
దీంతో మారటోరియం పొడగింపు అంశాన్ని ఆర్బీఐ చురుగ్గా పరిశీలిస్తోంది. మారటోరియంను పెంచితే జూన్, జూలై, ఆగస్టు నెలల ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాలను బ్యాంకులు తర్వాతి కాలంలో వసూలు చేసుకుంటాయి.
అయితే, ఈఎంఐలను వాయిదా వేసుకోవడం వల్ల రుణగ్రహీతలకు లాభమేమీ ఉండదని బ్యాంకర్లు అంటున్నారు. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత ఈ మూడు నెలల విరామ కాలానికి వడ్డీ లెక్కించి వేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు సైతం ప్రకటనలు కురిపించాయి.
This post was last modified on May 5, 2020 3:18 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…