Political News

వ‌ర్క్ ఫ్రం హోం బాధ త‌ప్పుతుంద‌ట‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి లాక్ డౌన్ నాటి నుంచి ఇప్పటి దాకా సాఫ్ట్‌వేర్‌ సంస్థల కార్యకలాపాలు ఉద్యోగుల ఇళ్ల నుంచే జరిగాయి.

అయితే లాక్‌డౌన్‌ను దశలవారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొడగిస్తుండడంతో ఈ సంస్థలు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. దీంతో ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌ని చేయించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

క‌రోనా విస్త‌ర‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మూడో విడత లాక్‌డౌన్ను ఈ నెల 17వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా ప్రభావమున్న ప్రాంతాలను గ్రీన్‌, రెడ్‌, ఆరెంజ్‌ జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. రెడ్‌జోన్లలో ఆంక్షలు విధించి, ఇత‌ర జోన్లలో ఉంటున్నవారు బయటకు రాకుండా కట్టడి చేస్తోంది.

రెడ్‌జోన్‌ కాకుండా మిగతా జోన్లలో ఉంటున్న ఉద్యోగులను పరిమిత సంఖ్యలో విధులకు హాజరయ్యేలా సాఫ్ట్‌వేర్‌ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి పాక్షికంగా తమ కార్యాలయాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయిస్తూనే మరికొంతమందిని కార్యాలయాలకు రావాలని ఆయా సంస్థల యాజమాన్యాల ఉద్యోగులకు ఈ-మెయిల్‌, వాట్సాప్‌ సమాచారాన్ని పంపించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులు అక్కడున్న వైరస్‌ ప్రభావాన్నిబట్టి విధులకు వచ్చేలా చూడాలని భావిస్తోంది. ఉద్యోగులు ఉంటున్న ప్రాంతం, జోన్లను బట్టి వారికి యాజమాన్యం రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. కార్యాలయాలు తిరిగి తెరుచుకున్నాక కూడా కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరాన్ని పాటించి విధులు నిర్వహించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి మాస్కుధరించి రావాలని, ప్రతీ కార్యాలయంలో శానిటైజర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలోలాగా రోజూ మూడు షిఫ్ట్‌లు కాకుండా కార్యాలయాలకు వచ్చే వారిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఐటీశాఖ నుంచి అనుమతి పొందినట్లు చెబుతున్నారు.

Satya

Recent Posts

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

18 minutes ago

నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి

షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…

48 minutes ago

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

2 hours ago

నాగబంధం.. ఈ కొత్త సౌండ్ ఎవరిది?

స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…

4 hours ago

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

5 hours ago