ఒకవైపు ఎముకలు కొరికేసేంత చలి. మరోవైపు కుండపోత వర్షం. దాంతో టెంట్లలోకి చేరిపోయిన వర్షంనీళ్ళు. అయినా సరే తమ దీక్షలను వదిలిపెట్టేది లేదంటూ భీష్మించుకుని రోడ్లపైనే కూర్చున్నారు. ఇది…తాజాగా సింఘూ ప్రాంతంలో వేలాదిమంది రైతుల పరిస్ధితి. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో వేలాదిమంది రైతులు మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన 40 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులను చలి, వర్షాలు కూడా ఏమీ చేయలేకపోయాయి.
ఇప్పటికి ఏడుసార్లు రైతుసంఘాలతో కేంద్రప్రభుత్వం జరిపిన చర్చలు ఫెయిలయ్యాయి. నిజానికి చట్టాలను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేకానీ తమ ఉద్యమాన్ని విరమించేది లేదంటూ రైతుసంఘాలు తెగేసి చెప్పాయి. అంటే ఇటు కేంద్రమైనా అటు రైతుసంఘాలైనా తమ డిమాండ్లకే పట్టుబట్టున్నాయి. అందుకనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎంత వ్యతిరేకతున్నా చట్టాలను అమలు చేయాల్సిందే అని ప్రధానమంత్రి నరేంద్రమోడి చాలా పట్టుదలగా ఉన్నారు.
ఇదే సమయంలో అవసరమైతే ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి కేంద్రం మెడలు వంచాలని రైతుసంఘాలు కూడా మహా పట్టుదలగా ఉన్నాయి. పంజాబులో మొదలై ఉద్యమం తర్వాత హర్యానాకు పాకింది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్ధాన్, పశ్చిమబెంగాల్ కూడా పాకింది. దేశంలోని అన్నీ రైతుసంఘాలను సంఘటితం చేయాలనేది ఉద్యమం చేస్తున్న రైతుసంఘాల ప్లాన్ గా కనబడుతోంది.
ఇప్పటికే ఉద్యమం చేస్తున్న రైతుల్లో దాదాపు 10 మంది చనిపోయారు. చలిని తట్టుకోలేకే కొందరు రైతులు మరణించారు. భోజనాలు, స్నానాలు, చర్చలు, వైద్య పరీక్షలు, నిద్ర, ఉదయంపూట వ్యాయామాలు అన్నీ దీక్షా ప్రాంతంలోనే జరిగిపోతున్నాయి. ఇన్ని రోజులైనా ఉద్యమం నుండి రైతులు ఎందుకు వెనక్కుపోవటం లేదు ? ఎందుకంటే పై రాష్ట్రాల నుండి రోజు వేలాదిమంది రైతులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. అలాగే వైద్యులతో పాటు కొన్ని స్వచ్చంద సంస్ధలు దీక్షా స్ధలానికి వచ్చి తమ సేవలను అందిస్తున్నాయి కాబట్టే.
రైతుసంఘాలతో స్వయంగా ప్రధానమంత్రి చర్చలకు కూర్చుంటే కానీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మోడే మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వ్యవసాయ చట్టాల రద్దును మోడి ఎందుకనో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ రైతాంగం కోసమే తాము చట్టాలను చేశామని మోడి చెబుతున్నారో అదే రైంతాగం ఆ చట్టాలను వద్దంటున్నాయి. అలాంటపుడు చట్టాలను రద్దు చేయటానికి మోడికి వచ్చిన సమస్యేమిటి ?
This post was last modified on January 7, 2021 11:49 am
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…