ఇంతకాలం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విషయంలో మౌనం వహించిన అన్నయ్య అళగిరి ఒక్కసారిగా బరస్టయ్యారు. మధురైలో పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తన తమ్ముడు ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి కాలేడంటు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పార్టీ పగ్గాల కోసం చాలా కాలంగా అన్న, తమ్ముళ్ళ మధ్య పెద్ద గొడవలే జరుగుతున్నాయి. వివిధ కారణాలతో కరుణానిధి ఉన్నపుడు అళగిరిని పార్టీ నుండి స్టాలిన్ బయటకు వెళ్ళగొట్టేలా ప్లాన్ చేశారనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నవే.
సరే కారణాలు ఏవైనా కరుణానిధి మరణం తర్వాత అన్న దమ్ములిద్దరు విడిపోయారు. చాలాకాలం అళిగిరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోయారు. అయితే ఈమధ్య తన మద్దతుదారులతో తరచు సమావేశాలు జరపుతున్నారు. వచ్చే మేనెలలలో షెడ్యూల్ ఎన్నికలు జరగాల్సుంది. ఈ నేపధ్యంలోనే అళగిరి రాజకీయాలు మళ్ళీ స్పీడందుకున్నాయి. బీజేపీలో చేరి ఎన్నికల్లో యాక్టివ్ అవుతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తానే కొత్తగా ఓ పార్టీ పెడతారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది.
జరుగుతున్న ప్రచారాలు ఎలాగున్నా మదురై సమావేశంతో మళ్ళీ యాక్టివ్ అయ్యారన్నది వాస్తవం. డీఎంకేలో తనకు జరిగిన అవమానాలను వివరించారు. తన సోదరుడు స్టాలిన్ను తాను ఎంతగా ప్రోత్సాహించింది వివరించి చెప్పాపరు. పార్టీ కోశాధికారిగా, డిప్యుటీ ముఖ్యమంత్రిగా స్టాలిన్ను తాను ప్రోత్సహించిన వైనాన్ని చెప్పారు. స్టాలిన్ కోసం తాను ఇంత చేస్తే సోదరుడు తనను ఎంతగానో అవమానించారని బాధపడ్డారు.
పార్టీ పటిష్టానికి తాను చేసిన కృషిని వివరించారు. దక్షిణ తమిళనాడులో పార్టీ పటిష్టానికి, గెలుపుకు తాను పడిన కష్టాన్ని చెప్పుకున్నారు. మొత్తంమీద సంవత్సరాలుగా స్టాలిన్ పై తనలో పేరుకుపోయిన ఆగ్రహాన్ని అళగిరి ఒక్కసారిగా బయటకు కక్కేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో అళగిరి స్టాలిన్ పై ఇలా విరుచుకుపడటంతో పార్టీలో సంచలనంగా మారింది. ఇదే సమయంలో స్టాలిన్ సీఎం అయ్యే అవకాశమే లేదని జోస్యం కూడా చెప్పేశారు. అళగిరి వ్యాఖ్యలు చూస్తుంటే తమ్ముడు అధికారంలోకి రాకుండా తెరవెనుక ఏదో పెద్ద కతే మొదలుపెట్టినట్లున్నారు.
This post was last modified on January 5, 2021 2:04 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…