Political News

కలియుగం క్లైమాక్స్ ఇదే.. జగన్ సంచలన వ్యాఖ్యలు

కొంత కాలంగా ఏపీలో హిందూ ఆలయాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం వల్లే దుండగులు రెచ్చిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ తరహా దాడులను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఈ ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. దేవుడితో చెలగాటమాడవద్దని, దేవుడితో పెట్టుకుంటే తప్పకుండా శిక్షిస్తాడని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆలయాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని జగన్ మండిపడ్డారు. దేవుడి విగ్రహాలతో రాజకీయ లబ్ది పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. కలియుగం క్లైమాక్స్ అంటే ఇదేనేమో అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలీస్ మీట్ లో పాల్గొన్న జగన్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై స్పందించారు. తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ తరహా ఘటనలను కొందరు ప్రోత్సహిస్తున్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. దేవుళ్ల జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి ఉంటటుందని? విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? అని జగన్ ప్రశ్నించారు. దేవుడంటే కొందరికి భయం భక్తీ లేకుండా పోయిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించే సమయంలోనే ఈ తరహా ఘటనలు జరగడం శోచనీయమని జగన్ అన్నారు.

తాము మంచిపనిని తలపెట్టినప్పుడల్లా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. నాడు-నేడు ప్రారంభించినప్పుడు గుంటూరులో గుడి ధ్వంసం ఘటన జరిగిందని కొందరు రచ్చ చేశారని, ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మరో గొడవకు తెరతీశారని విమర్శించారు. తానుచేసే మంచి పనులకు పబ్లిసిటీ రాకూడదనే కొందరు ఈ ధ్వంసరచనకు పూనుకున్నారన్నారని జగన్ ఆరోపించారు.

Satya

Recent Posts

హైద‌రాబాద్‌లో ఐమాక్స్… ఒక‌టి కాదు

దేశంలో అత్య‌ధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో…

15 minutes ago

తెలంగాణ మీ అయ్య జాగీరా?.. పవన్ ఫైర్

ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…

53 minutes ago

ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…

2 hours ago

“పాపం… పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు”

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…

3 hours ago

అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…

3 hours ago

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

3 hours ago