Political News

కేసీఆర్ తాజాగా చేయించిన సర్వేలో ప్రజలేం చెప్పారంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న అలవాట్లలో తరచూ సర్వేలు చేయించటం ఒకటి. హాట్ టాపిక్ లపై అదే పనిగా సర్వేలు చేయించటం.. అది కూడా ఒకట్రెండు కాకుండా.. వేర్వేరు సంస్థల చేత ఒకేసమయంలో నాలుగైదు చేయించటం.. వారిచ్చిన రిపోర్టులను క్రాస్ చెక్ చేసుకొని.. ఒక ఆలోచనకురావటం తెలిసిందే.

కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ వేళ.. ప్రజల మనసుల్లో ఏముంది? లాక్ డౌన్ ను ఎంతవరకు పొడిగించాలని ప్రజలు కోరుకుంటున్నారు? అందుకున్న కారణాలేమిటి? అన్న అంశాలపై కేసీఆర్ సారు తాజాగా సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

సర్వేలోని అంశాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేయటంలో సర్కారు సక్సెస్ అయ్యిందని.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయటంలో విజయం సాధించినట్లుగా వెల్లడైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కరోనాకు చెక్ చెప్పాలంటే లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగించాలన్న మాట ప్రజల మనసుల్లో ఉన్నట్లుగా తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను నెలాఖరు వరకూ పొడిగించాలన్న దానికే ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.

లాక్ డౌన్ 3.0 విషయానికి వస్తే.. కేంద్రం మే 17 వరకు లాక్ డౌన్ ను అమలుచేయనుంది. అయితే.. తెలంగాణ ప్రజలు మాత్రం మే చివరి వరకూ లాక్ డౌన్ ను అమలు చేయాలని.. ఆ తర్వాతి పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ లు లేకున్నా.. మరింత కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తేనే మంచిదన్న మాట కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తంగా మూసివేయకుండా.. వైరస్ వ్యాప్తి లేని చోట్ల లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తివేయాలన్న యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ మనసులోనూ.. తెలంగాణ ప్రజల మనసుల్లో లాక్ డౌన్ ను నెలాఖరు వరకు పొడిగించాలన్న మాటే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మే చివరి వరకూ తెలంగాణ లాక్ డౌన్ 3.0 ఉండే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. మరి.. సారు నిర్ణయం ఏముంటుందో చూడాలి.

This post was last modified on May 6, 2020 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago