పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్లు ప్రయోజకులై, సమాజంలో మంచి పేరు సంపాదించినపుడు, ఒక స్థాయి అందుకున్నపుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అందులోనూ ఒక తండ్రి పని చేస్తున్న చోటే కూతురు ఉన్నతోద్యోగిగా చేరితే.. ఆమెకు ఆ తండ్రి సెల్యూట్ చేయాల్సి వస్తే అది అమితానందాన్ని, ఎంతో స్ఫూర్తిని ఇచ్చే విషయమే. తిరుపతిలో తాజాగా ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఇక్కడ సీఐగా పని చేస్తున్న శ్యామ్ సుందర్.. డీఎస్పీ అయిన తన కూతురికి సెల్యూట్ చేసే అరుదైన దృశ్యం అందరి మనసులను తాకింది.
2018 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన జెస్సీ ప్రశాంతి ప్రస్తుతం గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా ‘దిశ’ విభాగంలో బాధ్యతలు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చారు. కాగా తిరుపతి కళ్యాణి డ్యామ్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. శ్యామ్ సుందర్ సైతం పోలీస్ డ్యూటీ మీట్కు హాజరయ్యారు. అక్కడ ప్రశాంతి ఉన్నతాధికారులతో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన శ్యామ్ సుందర్ కూతురిని చూసి ‘‘నమస్తే మేడమ్..’’ అంటూ సెల్యూట్ చేశారు. దీంతో ఆశ్చర్యపోయిన ప్రశాంతి.. ‘‘నాన్నా..’ అంటూ నవ్వేశారు. ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది.
ఈ అరుదైన దృశ్యం పోలీస్ డ్యూల్ మీట్కు హాజరైన ఉన్నతాధికారులను కూడా ఆకట్టుకుంది. చుట్టూ ఉన్న పోలీసులంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తూ చప్పట్లతో అభినందించారు. కూతురికి సెల్యూట్ చేయడంపై సీఐ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ… పిల్లలు ప్రయోజకులైతే తండ్రికి అంతకుమించిన సంతోషం ఏముంటుందని.. తన బిడ్డ నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి సన్నివేశాలు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటామన్నారు. తిరుపతి డ్యూటీ మీట్లో తండ్రీకూతుళ్లు ఇలా యూనిఫాం ధరించి విధుల్లో పాల్గొనడం వ్యక్తిగతంగా గర్వంగా ఉందన్నారు.
This post was last modified on January 4, 2021 1:55 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…