2014 ఎన్నికల తర్వాత.. గత ఏడాది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీలో బాగా హైలైట్ అయిన మహిళా నేతల్లో యామిని సాధినేని ఒకరు. పార్టీలో మహిళా నేతల వాయిస్ తగ్గిపోతున్న సమయంలో యామిని తెరపైకి వచ్చి బలంగా తన వాయిస్ వినిపించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన ‘మల్లెపూలు’ కామెంట్ అప్పట్లో సంచలనం రేపింది. ఈ కామెంట్ వల్ల ‘మల్లెపూల సాధిని’గా ఆమెకు గుర్తింపు రావడం గమనార్హం. ఐతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక చాలా మంది నేతల్లాగే యామిని కూడా పార్టీని వీడింది. ఆమె భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది. కానీ తెలుగుదేశం పార్టీలో మాదిరి ఇక్కడ ఆమె పెద్దగా హైలైట్ అయింది లేదు. చాలా వరకు తెర వెనుకే ఉండిపోయింది.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి యామిని వార్తల్లోకి వచ్చింది. ఏపీలో హిందూ ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు, విగ్రహాల ధ్వంసంపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏకంగా కన్నీళ్లు పెట్టేసుకుంటూ హిందూ ధర్మం గురించి వాపోయారు. ‘‘మహా సంఘటనం జరగాలి రాష్ట్రంలో. దయచేసి పెద్దలెవరైనా సరే ఉంటే.. అందరూ కలసికట్టుగా రండి. మేమంతా వస్తాం. ఎవరికి వారు ఇళ్లలోంచి బయటికి వద్దాం. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇంతకంటే దారుణాలు చూసే ఓపిక, భరించే శక్తి లేదసలు నిజంగా చెప్పాలంటే.
ప్రతి గుండె గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై ఈ ముష్కరులు ఎవరైనా సరే వారిని దహించేయాలి. ఎంత అవమాన పరుస్తున్నారు హిందువులను, దేవుళ్లను. అవమానం జరిగిన చోటే ఒక మహా సంకల్పానికి బీజం పడాలన్నది నా కోరిక’’ అంటూ ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది యామిని. ఈ వీడియో పట్ల సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ కామెంట్లే పడ్డాయి.
This post was last modified on January 4, 2021 1:38 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…