దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ అన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్క రోజే కదా.. ఇళ్ల నుంచి బయటికి రాకపోతే ఏమవుతుందిలే అనుకున్నారందరూ. కానీ తర్వాతి రోజు వచ్చి మూడు వారాల లాక్ డౌన్ అంటూ బాంబు పేల్చాడు ప్రధాని.
ఇక అక్కడి నుంచి మొదలైంది ఇంటి వాసం. బయట అన్నీ బంద్. ఇంటిపట్టున మందు కొట్టి ఎంజాయ్ చేద్దామనుకున్న మందుబాబులకు అవకాశమే లేకపోయింది. అప్పటికే ఇంట్లో స్టాక్ పెట్టుకున్న కాస్త మందు కొన్ని రోజుల్లో అయిపోయింది.
లాక్ డౌన్ ఎత్తేస్తారు వైన్ షాపుకు వెళ్దాం అంటే ఛాన్స్ దొరికితే కదా. ఒకటికి రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. మరి ఎప్పుడు ఆంక్షలు తొలగిపోతాయో.. వైన్ షాపులు ఎప్పుడు తెరుచుకుంటాయో అని మందుబాబులు ఉత్కంఠగా ఎదురు చూశారు.
దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ పొడిగించినప్పటికీ.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా మారిన నేపథ్యంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. సోమవారం మెజారిటీ రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే మందుబాబులు బారులు తీరారు.
ఐతే వైన్ షాపుల దగ్గర జనసందోహం చూశాక.. గంటలు గంటలు ఎదురు చూశాక.. ఇంకోసారి మద్యం దుకాణాలకు రావడం అంత సులువు కాదనిపించిందో.. లేక మళ్లీ ఎక్కడ మద్యం దుకాణాలు మూసేస్తారో అన్న భయం పుట్టిందో కానీ.. ఒకేసారి పెద్ద ఎత్తున స్టాక్ తీసుకెళ్లే ప్రయత్నంలో పడ్డారు మందుబాబులు.
50 వేలకు.. 90 వేలకు మద్యం కొన్న బిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎంత మందుకు కరువొచ్చినా కూడా ఒకేసారి ఇంత స్టాక్ పట్టుకుపోవాలా అంటూ ఆ బిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
This post was last modified on May 5, 2020 9:25 am
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…