దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ అన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్క రోజే కదా.. ఇళ్ల నుంచి బయటికి రాకపోతే ఏమవుతుందిలే అనుకున్నారందరూ. కానీ తర్వాతి రోజు వచ్చి మూడు వారాల లాక్ డౌన్ అంటూ బాంబు పేల్చాడు ప్రధాని.
ఇక అక్కడి నుంచి మొదలైంది ఇంటి వాసం. బయట అన్నీ బంద్. ఇంటిపట్టున మందు కొట్టి ఎంజాయ్ చేద్దామనుకున్న మందుబాబులకు అవకాశమే లేకపోయింది. అప్పటికే ఇంట్లో స్టాక్ పెట్టుకున్న కాస్త మందు కొన్ని రోజుల్లో అయిపోయింది.
లాక్ డౌన్ ఎత్తేస్తారు వైన్ షాపుకు వెళ్దాం అంటే ఛాన్స్ దొరికితే కదా. ఒకటికి రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. మరి ఎప్పుడు ఆంక్షలు తొలగిపోతాయో.. వైన్ షాపులు ఎప్పుడు తెరుచుకుంటాయో అని మందుబాబులు ఉత్కంఠగా ఎదురు చూశారు.
దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ పొడిగించినప్పటికీ.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా మారిన నేపథ్యంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. సోమవారం మెజారిటీ రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే మందుబాబులు బారులు తీరారు.
ఐతే వైన్ షాపుల దగ్గర జనసందోహం చూశాక.. గంటలు గంటలు ఎదురు చూశాక.. ఇంకోసారి మద్యం దుకాణాలకు రావడం అంత సులువు కాదనిపించిందో.. లేక మళ్లీ ఎక్కడ మద్యం దుకాణాలు మూసేస్తారో అన్న భయం పుట్టిందో కానీ.. ఒకేసారి పెద్ద ఎత్తున స్టాక్ తీసుకెళ్లే ప్రయత్నంలో పడ్డారు మందుబాబులు.
50 వేలకు.. 90 వేలకు మద్యం కొన్న బిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎంత మందుకు కరువొచ్చినా కూడా ఒకేసారి ఇంత స్టాక్ పట్టుకుపోవాలా అంటూ ఆ బిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…