జనవరి 4వ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే రైతుసంఘాలతో చర్చలకు నిర్ణయమైన తేదీ 4వ తేదీనే కాబట్టి. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు గడచిన 38 రోజులుగా జరుగుతున్న ఉద్యమం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కావాలంటే సవరణలు మాత్రం చేస్తామని ప్రదానమంత్రి నరేంద్రమోడి తెగేసి చెప్పారు. ఈ కారణంగానే ఇటు కేంద్రప్రభుత్వం అటు రైతుసంఘాల మధ్య చర్చల్లో పురోగతి కనబడటం లేదు.
ఇప్పటికి ఏడుసార్లు కేంద్రమంత్రులతో చర్చలు జరిగినా ఉపయోగం కనబడలేదని రైతుసంఘాల నేతలు ప్రకటించారు. జనవరి 4వ తేదీన ఎనిమిదో సారి సమావేశం కూడా ఫెయిల్ అయితే భారీ కార్యాచరణ ప్రణాళికకు రైతుసంఘాల నేతలు రెడీ అయిపోతున్నారు. ముందుగా హర్యానాలో అన్నీరకాల షాపింగ్ మాల్స్, పెట్రోలు బంకులు మూసివేయబోతున్నట్లు ప్రకటించారు. తర్వాత పరిస్దితిని సమీక్షించుకుని దశలవారీగా మరిన్నింటిని మూయించేస్తామని నేతలంటున్నారు. హర్యానాలో మొదలైతే తర్వాత ఇదే పద్దతిని పంజాబులో కూడా అమలు చేస్తామని చెప్పటం గమనార్హం.
అసలు రైతు ఉద్యమం మొదలైందే పంజాబులో. ఆ తర్వాత హర్యానాకు పాకింది. అయితే ముందు షాపింగుమాల్స్, పెట్రోలు బంకులను హర్యానాలో ఎందుకు మూసేస్తున్నారు ? ఎందుకంటే ఢిల్లీ-హర్యానా బార్డర్స్ లోని సింఘు ప్రాంతంలోనే ఇపుడు ఉద్యమం జరుగుతోంది కాబట్టే. ఎవరైనా ఢిల్లీలోకి రోడ్డుమార్గంలో ప్రవేశించాలంటే హర్యానాలోని సింఘు ప్రాంతంనుండే వెళ్ళాలి. అందుకనే సింఘూ ప్రాంతం మొత్తాన్ని వేలాది మంది రైతులు ఆక్రమించేసుకున్నారు. ఉద్యమ ప్రభావం పంజాబులో ఎంతుందో హర్యానాలో అంతకుమించే ఉంది.
ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఉద్యమప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర, రాజస్ధాన్ లో కూడా కనబడుతోంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో కూడా మొదలైంది. సరిగ్గా పశ్చిమబెంగాల్లో ఎన్నికలకు ముందు ఇటువంటి రైతుఉద్యమం మొదలవ్వటంతో కేంద్రప్రభుత్వంలోని పెద్దల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు జరిగినది చూస్తుంటే జనవరి 4వ తేదీన జరగబోయే కేంద్రమంత్రులు, రైతుసంఘాల చర్చలు సక్సెస్ అవుతాయనే నమ్మకం ఎవరిలోను లేదు. ఈ కారణంగానే ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు, తీవ్రస్ధాయికి చేర్చేందుకు రైతుసంఘాలు రెడీ అయిపోతున్నాయి. చూద్దాం 4వ తేదీన ఏమవుతుందో.
This post was last modified on January 2, 2021 11:16 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…