Political News

చిత్తూరు జిల్లాపై త‌మిళుల ఎటాక్

మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరుచుకోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా వాటి ముందు మందు బాబులు ఎలా బారులు తీరుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఐతే కొన్ని చోట్ల మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ మ‌ద్యం కొంటుండ‌టంతో ఇబ్బందేమీ లేన‌ట్లే క‌నిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం మాస్కుల్లేకుండా గుంపులు గుంపులుగా ఒక‌రి మీద ఒక‌రు ప‌డి తోసుకుంటూ మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్న దృశ్యాలే ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల ఇలాంటి దృశ్యాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అయితే ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా క‌నిపిస్తున్నాయి. కుప్ప‌లం, న‌గ‌రి త‌దిత‌ర ప్రాంతాల్లో వంద‌లు వేల‌మంది చాలా త‌క్కువ ప్ర‌దేశంలో గుమిగూడి మీద ప‌డి తోసుకుంటుండ‌టం.. పోలీసులు వారిని ఎంత‌మాత్రం నియంత్రించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఇలా ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌డానికి త‌మిళులే కార‌ణం అని తెలుస్తోంది. త‌మిళ‌నాట ఇంకా మ‌ద్యం దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో బార్డ‌ర్ దాటి చిత్తూరు జిల్లాకు వేల‌మంది వ‌చ్చారు. జిల్లాలో ఉన్న మందు బాబుల‌కు వాళ్లు కూడా తోడ‌వ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. న‌గ‌రిలో అయితే దృశ్యాలు మ‌రీ భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ప‌ల్లెటూరి ప్రాంతం కావ‌డంతో పోలీసులు అక్క‌డ పెద్ద‌గా దృష్టిసారించిన‌ట్లు లేరు. శ్రీకాళ‌హ‌స్తి మిన‌హాయిస్తే చిత్తూరు జిల్లాలో క‌రోనా అదుపులోనే ఉంది. కానీ త‌మిళ‌నాట భారీగా కేసులున్నాయి. అక్క‌డి వాళ్లు ఇలా వ‌చ్చి చిత్తూరు వాళ్ల‌పై ప‌డ‌టంతో క‌రోనా ప్ర‌భావం ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి మ‌ళ్లీ మ‌ద్యం దుకాణాలు తెర‌వాల‌న్న నిర్ణ‌యం డిజాస్ట‌ర్ అయ్యేట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైన్ షాపుల పుణ్య‌మా అని క‌రోనా వ్యాప్తి విశృంఖ‌ల స్థాయికి చేరుతుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on May 4, 2020 7:41 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

9 minutes ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

15 minutes ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

2 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

3 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

4 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

4 hours ago