Political News

చిత్తూరు జిల్లాపై త‌మిళుల ఎటాక్

మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరుచుకోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా వాటి ముందు మందు బాబులు ఎలా బారులు తీరుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఐతే కొన్ని చోట్ల మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ మ‌ద్యం కొంటుండ‌టంతో ఇబ్బందేమీ లేన‌ట్లే క‌నిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం మాస్కుల్లేకుండా గుంపులు గుంపులుగా ఒక‌రి మీద ఒక‌రు ప‌డి తోసుకుంటూ మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్న దృశ్యాలే ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల ఇలాంటి దృశ్యాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అయితే ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా క‌నిపిస్తున్నాయి. కుప్ప‌లం, న‌గ‌రి త‌దిత‌ర ప్రాంతాల్లో వంద‌లు వేల‌మంది చాలా త‌క్కువ ప్ర‌దేశంలో గుమిగూడి మీద ప‌డి తోసుకుంటుండ‌టం.. పోలీసులు వారిని ఎంత‌మాత్రం నియంత్రించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఇలా ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌డానికి త‌మిళులే కార‌ణం అని తెలుస్తోంది. త‌మిళ‌నాట ఇంకా మ‌ద్యం దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో బార్డ‌ర్ దాటి చిత్తూరు జిల్లాకు వేల‌మంది వ‌చ్చారు. జిల్లాలో ఉన్న మందు బాబుల‌కు వాళ్లు కూడా తోడ‌వ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. న‌గ‌రిలో అయితే దృశ్యాలు మ‌రీ భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ప‌ల్లెటూరి ప్రాంతం కావ‌డంతో పోలీసులు అక్క‌డ పెద్ద‌గా దృష్టిసారించిన‌ట్లు లేరు. శ్రీకాళ‌హ‌స్తి మిన‌హాయిస్తే చిత్తూరు జిల్లాలో క‌రోనా అదుపులోనే ఉంది. కానీ త‌మిళ‌నాట భారీగా కేసులున్నాయి. అక్క‌డి వాళ్లు ఇలా వ‌చ్చి చిత్తూరు వాళ్ల‌పై ప‌డ‌టంతో క‌రోనా ప్ర‌భావం ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి మ‌ళ్లీ మ‌ద్యం దుకాణాలు తెర‌వాల‌న్న నిర్ణ‌యం డిజాస్ట‌ర్ అయ్యేట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైన్ షాపుల పుణ్య‌మా అని క‌రోనా వ్యాప్తి విశృంఖ‌ల స్థాయికి చేరుతుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on May 4, 2020 7:41 pm

Share
Show comments

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

3 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

4 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

5 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

5 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

7 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

7 hours ago