మద్యం దుకాణాలు మళ్లీ తెరుచుకోవడంతో దేశవ్యాప్తంగా వాటి ముందు మందు బాబులు ఎలా బారులు తీరుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఐతే కొన్ని చోట్ల మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ మద్యం కొంటుండటంతో ఇబ్బందేమీ లేనట్లే కనిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం మాస్కుల్లేకుండా గుంపులు గుంపులుగా ఒకరి మీద ఒకరు పడి తోసుకుంటూ మద్యం కోసం ఎగబడుతున్న దృశ్యాలే ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితులు మరీ దారుణంగా కనిపిస్తున్నాయి. కుప్పలం, నగరి తదితర ప్రాంతాల్లో వందలు వేలమంది చాలా తక్కువ ప్రదేశంలో గుమిగూడి మీద పడి తోసుకుంటుండటం.. పోలీసులు వారిని ఎంతమాత్రం నియంత్రించే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
చిత్తూరు జిల్లాలో ఇలా పరిస్థితులు అదుపు తప్పడానికి తమిళులే కారణం అని తెలుస్తోంది. తమిళనాట ఇంకా మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో బార్డర్ దాటి చిత్తూరు జిల్లాకు వేలమంది వచ్చారు. జిల్లాలో ఉన్న మందు బాబులకు వాళ్లు కూడా తోడవడంతో పరిస్థితి అదుపు తప్పింది. నగరిలో అయితే దృశ్యాలు మరీ భయపెట్టేలా ఉన్నాయి. పల్లెటూరి ప్రాంతం కావడంతో పోలీసులు అక్కడ పెద్దగా దృష్టిసారించినట్లు లేరు. శ్రీకాళహస్తి మినహాయిస్తే చిత్తూరు జిల్లాలో కరోనా అదుపులోనే ఉంది. కానీ తమిళనాట భారీగా కేసులున్నాయి. అక్కడి వాళ్లు ఇలా వచ్చి చిత్తూరు వాళ్లపై పడటంతో కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి మళ్లీ మద్యం దుకాణాలు తెరవాలన్న నిర్ణయం డిజాస్టర్ అయ్యేట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైన్ షాపుల పుణ్యమా అని కరోనా వ్యాప్తి విశృంఖల స్థాయికి చేరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…