Political News

చిత్తూరు జిల్లాపై త‌మిళుల ఎటాక్

మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరుచుకోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా వాటి ముందు మందు బాబులు ఎలా బారులు తీరుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఐతే కొన్ని చోట్ల మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ మ‌ద్యం కొంటుండ‌టంతో ఇబ్బందేమీ లేన‌ట్లే క‌నిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం మాస్కుల్లేకుండా గుంపులు గుంపులుగా ఒక‌రి మీద ఒక‌రు ప‌డి తోసుకుంటూ మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్న దృశ్యాలే ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల ఇలాంటి దృశ్యాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అయితే ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా క‌నిపిస్తున్నాయి. కుప్ప‌లం, న‌గ‌రి త‌దిత‌ర ప్రాంతాల్లో వంద‌లు వేల‌మంది చాలా త‌క్కువ ప్ర‌దేశంలో గుమిగూడి మీద ప‌డి తోసుకుంటుండ‌టం.. పోలీసులు వారిని ఎంత‌మాత్రం నియంత్రించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఇలా ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌డానికి త‌మిళులే కార‌ణం అని తెలుస్తోంది. త‌మిళ‌నాట ఇంకా మ‌ద్యం దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో బార్డ‌ర్ దాటి చిత్తూరు జిల్లాకు వేల‌మంది వ‌చ్చారు. జిల్లాలో ఉన్న మందు బాబుల‌కు వాళ్లు కూడా తోడ‌వ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. న‌గ‌రిలో అయితే దృశ్యాలు మ‌రీ భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ప‌ల్లెటూరి ప్రాంతం కావ‌డంతో పోలీసులు అక్క‌డ పెద్ద‌గా దృష్టిసారించిన‌ట్లు లేరు. శ్రీకాళ‌హ‌స్తి మిన‌హాయిస్తే చిత్తూరు జిల్లాలో క‌రోనా అదుపులోనే ఉంది. కానీ త‌మిళ‌నాట భారీగా కేసులున్నాయి. అక్క‌డి వాళ్లు ఇలా వ‌చ్చి చిత్తూరు వాళ్ల‌పై ప‌డ‌టంతో క‌రోనా ప్ర‌భావం ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి మ‌ళ్లీ మ‌ద్యం దుకాణాలు తెర‌వాల‌న్న నిర్ణ‌యం డిజాస్ట‌ర్ అయ్యేట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైన్ షాపుల పుణ్య‌మా అని క‌రోనా వ్యాప్తి విశృంఖ‌ల స్థాయికి చేరుతుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on May 4, 2020 7:41 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

37 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

47 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

1 hour ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago