Political News

జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పై దాఖలైన డిక్లరేషన్ కేసును హైకోర్టు కొట్టేసింది. ఈమధ్యనే తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించారంటూ గోల మొదలైంది. ఈ విషయంపై జగన్ తో పాటు మంత్రులు కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో అనీల్ కుమార్ సింఘాల్, టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలను పదవుల నుండి తొలగించాలంటు కోర్టులో కేసు వేశారు.

ఈ కేసును విచారించిన హైకోర్టు కేసును కొట్టేసింది. ఆలయంలోకి ప్రవేశించేటపుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది. జగన్ క్రైస్తవుడనేందుకు ఆధారాలను పిటీషనర్ ఇవ్వలేదని అలాగే స్వయంగా టీటీడీ ఆహ్వానం మేరకే జగన్ పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చారు కాబట్టి నిబంధనలు వర్తించవని కూడా స్పష్టంగా తేల్చేచింది.

ఇక చర్చిలకు, వెళ్ళినా, బైబిల్ ను పట్టుకుని ప్రార్ధనలకు వెళ్ళినా లేదా సువార్త కూటములకు హాజరైనంత మాత్రాన సదరు వ్యక్తిని క్రిస్తియన్ అని ఎలా చెబుతారంటూ నిలదీసింది. ఈమధ్యనే విజయవాడలో జరిగిన గురుద్వారా ప్రార్ధనల్లో జగన్ పాల్గొన్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. గురుద్వారాకు వెళ్ళి ప్రార్ధనల్లో పాల్గొన్నంత మాత్రాన జగన్ సిక్కు అయిపోయినట్లేనా అని పిటీషనర్ ను నిలదీసింది.

చర్చి ప్రార్ధనల్లో పాల్గొనటం, బైబిలుకు సంబంధించిన పేరు పెట్టుకోవటం, ఇంట్లో శిలువ ఉండటం కారణంగా సదరు వ్యక్తిని క్రిస్తియన్ అనుకునేందుకు లేదని కోర్టు స్పష్టం చేసేసింది. ఎవరైనా హైందవేతురులు వ్యక్తిగత హోదాలో తిరుమల ఆలయానికి వెళ్ళినపుడు మాత్రమే టీటీడీ చట్టంలోని 136వ నిబంధన ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది. కోర్టు తాజా తీర్పుతో జగన్ పై ఉన్న డిక్లరేషన్ వివాదం ముగిసినట్లే అనుకోవాలి.

This post was last modified on December 31, 2020 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

51 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

5 hours ago