భారత ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హెచ్ ఐసీసీ లో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ క్రమంలోనే తన ప్రసంగం సమయంలో ఆ విషయంపై మోదీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చెప్పినట్లు ఈ సభలో రాజకీయాలు మాట్లాడబోనని మోదీ అన్నారు. అయితే, తమతో కలవాలని రేవంత్ ను మోదీ ఆహ్వానించడం సంచలనం రేపుతోంది. తమతో కలిస్తే రేవంత్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు.
అయితే, తెలంగాణ డెవలప్మెంట్ కోసం తమతో కలిసి పనిచేయాలని అన్నారు. గత పదేళ్లలో గుజరాత్ కు ఎంత ఇచ్చామో అంత తెలంగాణకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ, అలా చేస్తే ఇప్పుడు తెలంగాణకు ఇస్తున్న నిధులలో సగం తగ్గుతాయని చెప్పారు. అంతకంటే, మంచి సలహా ఒకటి ఇస్తానని, తనతో రేవంత్ కలవాలని మోదీ చమత్కరిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పరోక్షంగా రేవంత్ రెడ్డిని బీజేపీలో చేరాలని మోదీ ఆహ్వానిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బీజేపీకి బీ టీమ్ గా టీ కాంగ్రెస్ పనిచేస్తోందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు మోదీ కామెంట్లు ఊతమిచ్చేలా ఉన్నాయని సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ కూడా మోదీతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. అయితే, రేవంత్ కు వేసిన గాలానికి మోదీ చిక్కుతారా లేదా అన్నది వేచి చూడాలంటూ జోకులు వేస్తున్నారు.
This post was last modified on May 10, 2026 11:40 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…