Political News

మళ్లీ ప్రజల్లోకి లోకేష్.. ఈ సారి యువగళాన్నిమించి..!

టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యవర్గం కూడా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టింది. అయితే అత్యంత సెంటిమెంట్‌తో కూడిన కీలక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పదవిని పొందడం, భవిష్యత్ రాజకీయ అధిపతిగా మారనుండడం వంటి అంశాలు నారా లోకేష్‌కు అంత తేలిక కాదనేది స్పష్టమవుతోంది.

ఈ క్రమంలోనే పార్టీలో ఆయనకు మరింతగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పార్టీలో ఇక నెంబర్ 2 స్థానాన్ని నారా లోకేష్ కైవసం చేసుకోనున్నారనేది కూడా వాస్తవం. దీంతో రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాజకీయంగా కావచ్చు, టికెట్ల పరంగా కావచ్చు, ప్రజల కోణంలో చూసుకున్నప్పటికీ ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు నారా లోకేష్‌ను మరింతగా పరిచయం చేయాలన్న ఉద్దేశం ఉంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. అయితే ఈ విషయంపై పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతర్గత చర్చల్లో వస్తున్న అంశాలను గమనిస్తే, గతంలో యువ గళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారో, ఇప్పుడు అటు ప్రజలకు ఇటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు మరింతగా చేరువ కావాలి అన్నది పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి ఇచ్చినప్పటికీ, ఆయనకు అటు పార్టీలో సీనియర్లు, జూనియర్లు సహా అందరూ మరింతగా నారా లోకేష్‌ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అదే విధంగా ప్రజలు కూడా టిడిపి తదుపరి నాయకుడిగా నారా లోకేష్‌ను సొంతం చేసుకోవాలి. భవిష్యత్తు పార్టీ అధినేతగా నారా లోకేష్‌ను ప్రజలు అంగీకరించాలి. ఇప్పటి వరకు మంత్రిగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యువ నాయకుడిగా బలమైన వ్యూహాలు అనుసరించే మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే దీనికి భిన్నంగా, భవిష్యత్తు తరాన్ని, ముఖ్యంగా భవిష్యత్తులో టిడిపిని నడిపించగలిగిన స్థాయిలో నారా లోకేష్ ఎదగాలంటే మరింతగా ప్రజల్లోకి ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే రాబోయే రెండు మాసాల్లో ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ కాలం గడిపేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. తద్వారా లోకేష్‌కు అనుభవంతో పాటు ప్రజలకు చేరువ కావచ్చు అనేది పార్టీ ప్రధాన ఉద్దేశం. తద్వారా లోకేష్‌కు ఇక తిరుగు ఉండదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on May 5, 2026 2:28 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

40 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago