Political News

మళ్లీ ప్రజల్లోకి లోకేష్.. ఈ సారి యువగళాన్నిమించి..!

టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యవర్గం కూడా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టింది. అయితే అత్యంత సెంటిమెంట్‌తో కూడిన కీలక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పదవిని పొందడం, భవిష్యత్ రాజకీయ అధిపతిగా మారనుండడం వంటి అంశాలు నారా లోకేష్‌కు అంత తేలిక కాదనేది స్పష్టమవుతోంది.

ఈ క్రమంలోనే పార్టీలో ఆయనకు మరింతగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పార్టీలో ఇక నెంబర్ 2 స్థానాన్ని నారా లోకేష్ కైవసం చేసుకోనున్నారనేది కూడా వాస్తవం. దీంతో రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాజకీయంగా కావచ్చు, టికెట్ల పరంగా కావచ్చు, ప్రజల కోణంలో చూసుకున్నప్పటికీ ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు నారా లోకేష్‌ను మరింతగా పరిచయం చేయాలన్న ఉద్దేశం ఉంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. అయితే ఈ విషయంపై పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతర్గత చర్చల్లో వస్తున్న అంశాలను గమనిస్తే, గతంలో యువ గళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారో, ఇప్పుడు అటు ప్రజలకు ఇటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు మరింతగా చేరువ కావాలి అన్నది పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి ఇచ్చినప్పటికీ, ఆయనకు అటు పార్టీలో సీనియర్లు, జూనియర్లు సహా అందరూ మరింతగా నారా లోకేష్‌ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అదే విధంగా ప్రజలు కూడా టిడిపి తదుపరి నాయకుడిగా నారా లోకేష్‌ను సొంతం చేసుకోవాలి. భవిష్యత్తు పార్టీ అధినేతగా నారా లోకేష్‌ను ప్రజలు అంగీకరించాలి. ఇప్పటి వరకు మంత్రిగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యువ నాయకుడిగా బలమైన వ్యూహాలు అనుసరించే మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే దీనికి భిన్నంగా, భవిష్యత్తు తరాన్ని, ముఖ్యంగా భవిష్యత్తులో టిడిపిని నడిపించగలిగిన స్థాయిలో నారా లోకేష్ ఎదగాలంటే మరింతగా ప్రజల్లోకి ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే రాబోయే రెండు మాసాల్లో ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ కాలం గడిపేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. తద్వారా లోకేష్‌కు అనుభవంతో పాటు ప్రజలకు చేరువ కావచ్చు అనేది పార్టీ ప్రధాన ఉద్దేశం. తద్వారా లోకేష్‌కు ఇక తిరుగు ఉండదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on May 5, 2026 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్టీఆర్ నీల్ మూవీకి ‘దేవ’ పెన్ను బలం?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…

2 hours ago

మూర్తిగారు చెప్పినవి అక్షరాలా నిజాలు

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…

4 hours ago

ఆ ఇద్దరు సీఎంలకు మరో ఛాన్స్ ఉన్నట్టే!

దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…

4 hours ago

విజయ్ మాత్రమే కాదు.. డ్రైవర్ కొడుకు కూడా

నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…

4 hours ago

విజ‌య్‌కు క‌లిసి వ‌చ్చిందేంటి?

త‌మిళ‌నాట ఎవ‌రి అంచ‌నాకు అంద‌ని విదంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న అధికారంలోకి…

4 hours ago

ఎన్టీఆర్, ఎంజీఆర్.. మధ్యలో విజయ్

దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ముందుంటాయి.…

7 hours ago