Political News

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆకివీడులోని పెదపేటలో రామాలయం పునర్నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని, అలాంటి వారి నుంచి ఎన్ని రకాలైన అడ్డుంకులు ఎదురైనా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.

పెదపేటలోని రామాలయానికి చెందిన స్థలంలో ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టే దిశగా ఇటీవలే అక్కడికి వెళ్లిన రఘురామపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి యత్నించారు. సదరు స్థలంలో గతంలో రామాలయం లేదని, తాము పూజించేగొంతేనమ్మ ఆలయం ఉండేదని, అక్కడ రామాలయాన్ని నిర్మిస్తామంటే ఊరుకునేది లేదని అక్కడి వారు వాదించారు. ఈ సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి గొడవకు కారణమైన వారిని అరెస్టు చేశారు. ఆపై వారు కోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. పరిస్థితి ఎలా ఉన్నా రామాలయం పునర్నిర్మాణం దిశగా రఘురామ వేగంగా అడుగులు వేశారు.

రామాలయం పునర్నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేలా సుముహూర్తం పెట్టాలని రఘురామ వేద పండితులను కోరారట. ఈ క్రమంలో మే 3వ తేదీన ఉదయం 7.14 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందని పండితులు చెప్పారట. అయితే ఈ ముహూర్తంతో పాటుగా మరో ముహూర్తాన్ని కూడా చూడాలని రఘురామ వారిని కోరగా.. మే 3 నాటి ముహూర్తం దివ్యమైనదని, ఆ ముహూర్తానికే రామాలయ పునర్నిర్మాణ శంకుస్తాపన జరిగి తీరుతుందని వారు చెప్పారట. దీంతో రఘురామ ఆదివారం నాటి ముహూర్తానికే ఆలయ పునర్నిర్మాణానికి వేది పండితుల ఆశీర్వచనాల మధ్య శంకుస్తాపన చేశారు.

ఈ సందర్భంగా రఘురామ భావోద్వేగానికి గురయ్యారు. రామాలయానికి చెందిన స్థలంలో ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకునేందకు కొందరు యత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామాలయాన్ని ఎలా కడతారో చూస్తామని, ఆలయ నిర్మాణాన్ని అడ్దుకుని తీరతామని కొందరు బెదిరిస్తున్నారని కూడా ఆయన అన్నారు.

మరికొందరు ఏకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారని, ఇంకొందరు కూడా కోర్టులకు వెళతామని చెబుతున్నారని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరతానని ఆయన ప్రకటించారు. ఆలయాన్ని కృష్ణ శిలతో నిర్మిస్తున్నామన్న రఘురామ.. 8 దశాబ్దాల పాటు ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు.

This post was last modified on May 3, 2026 3:42 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

38 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago