పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నపుడు ఎంత దూకుడుగా, ఆవేశంగా మాట్లాడేవారో తెలిసిందే. యువతకు నచ్చేది ఆ దూకుడే. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టాక మాత్రం ఆవేశం తగ్గించుకున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆవేశపడితే, నోరు జారితో బాగుండదని అనుకున్నారో ఏమో. పార్టీ పెట్టిన కొత్తలో, గత ఎన్నికలకు ముందు అయినా అప్పుడప్పుడూ కొంత ఆవేశం చూపించేవాడు, దూకుడుగా మాట్లాడేవాడు కానీ.. ఈ మధ్య మాత్రం మరీ సాత్వికంగా తయారయ్యాడు. ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేటపుడు కూడా ఆయన మాటలు పదునుగా ఉండట్లేదు.
ఈ రోజుల్లో ఇలా ఉంటే చాలా కష్టం అని.. దూకుడు పెంచాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నా పవన్ మాత్రం సాఫ్ట్గానే మాట్లాడుతున్నాడు. ఐతే ఇటీవల వరద వల్ల నష్టపోయిన రైతుల కోసం పార్టీ తరఫున పోరాటం మొదలుపెట్టిన పవన్.. స్వరం మార్చాడు. తాజాగా మచిలీపట్నం పర్యటనలో పవన్ అధికార పార్టీ మీద పదునైన పంచ్లు విసిరి అభిమానుల్లో వేడి పుట్టించారు.
తన కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ పేరును పవన్ ఈ పర్యటన ఉచ్ఛరించడం విశేషం. తనపై తరచుగా విమర్శలు చేస్తున్న పేర్ని నానీని ఉద్దేశించి పవన్ పంచ్ డైలాగులు పేల్చాడు. ‘‘శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం అంటారు. అలాగే శతకోటి నానీల్లో ఒక నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్కు చిదతలు కొడితే కొట్టుకో, నన్ను తిడితేనే నీ మంత్రి పదవి ఉంటుందంటే తిట్టుకో నాకేం పర్వాలేదు. కానీ రైతులకు అండగా నిలబడాలి. ఏమయ్యా నానీ. నువ్వు నన్ను తిట్టింది చాల్లే కానీ పోయి పనికొచ్చే పని ఏదైనా చేయవయ్యా. వైసీపీ నాయకులారా.. శృతిమించితే మీపై పోరాటం చేస్తాం. ఈ విషయం సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. రైతులకు న్యాయం చేయకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొస్తాం జాగ్రత్త. మీ వైఎస్సార్ సీపీ నాయకులు నాయకులు నోరేసుకుని రోడ్లమీదకు వస్తే మేము రాలేమనుకుంటున్నారా జగన్ రెడ్డీ. మేము కూడా రోడ్లమీదకు వస్తాం సిద్ధంగా ఉండండి, తేల్చుకుందాం రైతులకు ఎకరానికి 35 వేలు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం ఇది తథ్యం సీఎం సాబ్. కానీ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం రోడ్డుకు మీదకు తీసుకోస్తాం. మీరు జనసేనకు భయపడి అసెంబ్లీ సమావేశాలు పులివెందులలో పెట్టుకున్నా సరే వచ్చి ముట్టడిస్తాం జాగ్రత్త’’ అంటూ పవన్ పంచ్ల మీద పంచ్లు వేసి రోడ్ షోకు హాజరైన జనసేన కార్యకర్తలు, జనాల్లో హుషారు పుట్టించాడు.
This post was last modified on December 28, 2020 6:11 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…