పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నపుడు ఎంత దూకుడుగా, ఆవేశంగా మాట్లాడేవారో తెలిసిందే. యువతకు నచ్చేది ఆ దూకుడే. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టాక మాత్రం ఆవేశం తగ్గించుకున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆవేశపడితే, నోరు జారితో బాగుండదని అనుకున్నారో ఏమో. పార్టీ పెట్టిన కొత్తలో, గత ఎన్నికలకు ముందు అయినా అప్పుడప్పుడూ కొంత ఆవేశం చూపించేవాడు, దూకుడుగా మాట్లాడేవాడు కానీ.. ఈ మధ్య మాత్రం మరీ సాత్వికంగా తయారయ్యాడు. ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేటపుడు కూడా ఆయన మాటలు పదునుగా ఉండట్లేదు.
ఈ రోజుల్లో ఇలా ఉంటే చాలా కష్టం అని.. దూకుడు పెంచాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నా పవన్ మాత్రం సాఫ్ట్గానే మాట్లాడుతున్నాడు. ఐతే ఇటీవల వరద వల్ల నష్టపోయిన రైతుల కోసం పార్టీ తరఫున పోరాటం మొదలుపెట్టిన పవన్.. స్వరం మార్చాడు. తాజాగా మచిలీపట్నం పర్యటనలో పవన్ అధికార పార్టీ మీద పదునైన పంచ్లు విసిరి అభిమానుల్లో వేడి పుట్టించారు.
తన కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ పేరును పవన్ ఈ పర్యటన ఉచ్ఛరించడం విశేషం. తనపై తరచుగా విమర్శలు చేస్తున్న పేర్ని నానీని ఉద్దేశించి పవన్ పంచ్ డైలాగులు పేల్చాడు. ‘‘శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం అంటారు. అలాగే శతకోటి నానీల్లో ఒక నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్కు చిదతలు కొడితే కొట్టుకో, నన్ను తిడితేనే నీ మంత్రి పదవి ఉంటుందంటే తిట్టుకో నాకేం పర్వాలేదు. కానీ రైతులకు అండగా నిలబడాలి. ఏమయ్యా నానీ. నువ్వు నన్ను తిట్టింది చాల్లే కానీ పోయి పనికొచ్చే పని ఏదైనా చేయవయ్యా. వైసీపీ నాయకులారా.. శృతిమించితే మీపై పోరాటం చేస్తాం. ఈ విషయం సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. రైతులకు న్యాయం చేయకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొస్తాం జాగ్రత్త. మీ వైఎస్సార్ సీపీ నాయకులు నాయకులు నోరేసుకుని రోడ్లమీదకు వస్తే మేము రాలేమనుకుంటున్నారా జగన్ రెడ్డీ. మేము కూడా రోడ్లమీదకు వస్తాం సిద్ధంగా ఉండండి, తేల్చుకుందాం రైతులకు ఎకరానికి 35 వేలు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం ఇది తథ్యం సీఎం సాబ్. కానీ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం రోడ్డుకు మీదకు తీసుకోస్తాం. మీరు జనసేనకు భయపడి అసెంబ్లీ సమావేశాలు పులివెందులలో పెట్టుకున్నా సరే వచ్చి ముట్టడిస్తాం జాగ్రత్త’’ అంటూ పవన్ పంచ్ల మీద పంచ్లు వేసి రోడ్ షోకు హాజరైన జనసేన కార్యకర్తలు, జనాల్లో హుషారు పుట్టించాడు.
This post was last modified on December 28, 2020 6:11 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…