Political News

జ‌గ‌న్ స‌ర్కారుకు చెత్త సెగ గ‌ట్టిగానే త‌గిలిందే


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం త‌ర‌చుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవ‌డం చాలా మామూలు వ్య‌వ‌హారం అయిపోయింది. ఏడాదిన్న‌ర పాల‌నలో ఎన్నెన్ని వివాదాలో లెక్కే లేదు. ఇంత‌కుముందెన్నడూ చూడ‌ని విచిత్రాలు ఏపీలో ఈ ఏడాదిన్న‌ర‌లోనే జ‌రిగాయి. తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో జ‌రిగిన ఓ ప‌రిణామం సంచ‌ల‌నం రేపింది.

ఇటీవ‌లే జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద వీధి వ్యాపారుల‌కు రూ.10 వేల చొప్పున పూచీ‌క‌త్తు లేకుండా రుణాలిస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌గా.. బ్యాంకులు అందుకు నిరాక‌రిస్తున్నాయి. ఉయ్యూరులోని ఎస్బీఐ, యూనియ‌న్ బ్యాంకు శాఖ‌లు ఈ ప‌థ‌కం కింద లోన్లు ఇవ్వ‌నందుకుగాను వాటి కార్యాల‌యాల ముందు చెత్త పోయ‌డం చర్చ‌నీయాంశం అయింది.

అక్క‌డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, మున్సిప‌ల్ శాఖ అధికారుల స‌హ‌కారంతోనే ఈ ప‌ని చేశారు. ఇలా ఎందుకు చేసింది నోట్ కూడా పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై సోష‌ల్ మీడియాలో పెద్ద రచ్చే జ‌రిగింది. వైకాపా నేత‌లు, అధికారుల తీరు తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. బ్యాంకుల‌తో వ్య‌వ‌హారం కావ‌డంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సైతం ఈ విష‌యంలో జోక్యం చేసుకుని రాష్ట్ర‌ ఆర్థిక మంత్రితో మాట్లాడింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం న‌ష్ట నివార‌ణ చర్య‌లు చేప‌ట్టింది. ఈ ఘ‌ట‌న‌కు ఉయ్యూరు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను బాధ్యుడిని చేస్తూ ఆయ‌న‌పై వేటు వేసింది. ఐతే ఈ ప‌నికి ప్ర‌ధానంగా బాధ్య‌త వ‌హించాల్సింది స్థానిక నాయ‌కులే అన్న‌ది అక్క‌డి వారి మాట‌. మున్సిప‌ల్ శాఖ నుంచి వారికి స‌హ‌కారం అంది ఉండొచ్చు. అలాంటిది నాయ‌కుల‌పై ఏ చ‌ర్య‌లూ లేకుండా మున్సిప‌ల్ క‌మిష‌నర‌న్‌పై వేటు వేయ‌డమేంట‌న్నా ప్ర‌శ్నా త‌లెత్తుతోంది. ఐతే ఈ చెత్త ప‌ని తాలూకు సెగ మాత్రం అధికార పార్టీకి, ప్ర‌భుత్వానికి గ‌ట్టిగానే త‌గిన‌ట్లుంద‌న్న‌ది స్ప‌ష్టం.

This post was last modified on December 28, 2020 11:34 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago