పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్ సభ స్థానాల సంగతేంటి? 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
దీనికి తోడు బయటకు వచ్చిన బిల్లులోనూ దీనిపై స్పష్టత లేకపోవటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు (గురువారం) ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టే వేళలో.. కేంద్రం పలు అంశాల మీద ఫుల్ క్లారిటీ ఇస్తుందని స్పష్టం చేసినప్పటికి.. అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ చాలామందిలో ఉంది. ఇది సామాన్యుల విషయంలోనే కాదు.. పాలకుల విషయంలోనూ.
సరిగ్గా ఇలాంటి సందేహాలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురయ్యాయి. సాదాసీదా జనమైతే.. అంచనాలు.. ఊహాగానాలు..లాజిక్కులతో సరిపెట్టుకుంటారు. కానీ.. ఇలాంటి పరిస్థితే చంద్రబాబుకు ఎదురైతే ఆయన ఎందుకు ఊరుకుంటారు చెప్పండి.
బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సమావేశంలో ఎదురైన సందేహాల్ని అప్పటికప్పుడే తీర్చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు.. ఆ వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లతో ఫోన్ లో మాట్లాడారు.
పునర్విభజన బిల్లులో లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపర్చకపోవటం ఏమిటి? దీనిపై నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించగా.. వారు స్పందిస్తూ.. బిల్లులోఅన్ని వివరాలు పొందుపర్చలేమని.. అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు 50 శాతం పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా ఈ అంశాన్ని పార్లమెంటు వేధికగా ప్రభుత్వం పేర్కొంటుందన్న అంశంపైనా చంద్రబాబుకు సమాచారం అందింది.
అనంతరం తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు.. కిషన్ రెడ్డి.. రామ్మోహన్ నాయుడుతోనూ మాట్లాడారు. కేంద్రమంత్రులతో స్వయంగా మాట్లాడి.. స్పష్టత తీసుకున్న అనంతరం బిల్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
50 శాతం నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని.. దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ ముగ్గురు డిసైడ్ అయ్యారు. చంద్రబాబుకు డౌట్ రావటం మామూలే అయినా.. దానిపై ఆయన ఇన్ స్టెంట్ గా క్లారిటీ తీసుకున్న వైనం.. కోట్లాది మంది తెలుగు వారికి సైతం స్పష్టతను ఇచ్చిందని చెప్పక తప్పదు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…