Political News

చంద్రబాబు అంటే ఆ మాత్రం ఉండదా?

పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్ సభ స్థానాల సంగతేంటి? 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

దీనికి తోడు బయటకు వచ్చిన బిల్లులోనూ దీనిపై స్పష్టత లేకపోవటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు (గురువారం) ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టే వేళలో.. కేంద్రం పలు అంశాల మీద ఫుల్ క్లారిటీ ఇస్తుందని స్పష్టం చేసినప్పటికి.. అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ చాలామందిలో ఉంది. ఇది సామాన్యుల విషయంలోనే కాదు.. పాలకుల విషయంలోనూ.

సరిగ్గా ఇలాంటి సందేహాలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురయ్యాయి. సాదాసీదా జనమైతే.. అంచనాలు.. ఊహాగానాలు..లాజిక్కులతో సరిపెట్టుకుంటారు. కానీ.. ఇలాంటి పరిస్థితే చంద్రబాబుకు ఎదురైతే ఆయన ఎందుకు ఊరుకుంటారు చెప్పండి.

బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సమావేశంలో ఎదురైన సందేహాల్ని అప్పటికప్పుడే తీర్చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు.. ఆ వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లతో ఫోన్ లో మాట్లాడారు.

పునర్విభజన బిల్లులో లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపర్చకపోవటం ఏమిటి? దీనిపై నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించగా.. వారు స్పందిస్తూ.. బిల్లులోఅన్ని వివరాలు పొందుపర్చలేమని.. అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు 50 శాతం పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా ఈ అంశాన్ని పార్లమెంటు వేధికగా ప్రభుత్వం పేర్కొంటుందన్న అంశంపైనా చంద్రబాబుకు సమాచారం అందింది.

అనంతరం తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు.. కిషన్ రెడ్డి.. రామ్మోహన్ నాయుడుతోనూ మాట్లాడారు. కేంద్రమంత్రులతో స్వయంగా మాట్లాడి.. స్పష్టత తీసుకున్న అనంతరం బిల్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

50 శాతం నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని.. దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ ముగ్గురు డిసైడ్ అయ్యారు. చంద్రబాబుకు డౌట్ రావటం మామూలే అయినా.. దానిపై ఆయన ఇన్ స్టెంట్ గా క్లారిటీ తీసుకున్న వైనం.. కోట్లాది మంది తెలుగు వారికి సైతం స్పష్టతను ఇచ్చిందని చెప్పక తప్పదు.

This post was last modified on April 16, 2026 10:56 am

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

44 minutes ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

1 hour ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

2 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

3 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

3 hours ago