Political News

చంద్రబాబు అంటే ఆ మాత్రం ఉండదా?

పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్ సభ స్థానాల సంగతేంటి? 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

దీనికి తోడు బయటకు వచ్చిన బిల్లులోనూ దీనిపై స్పష్టత లేకపోవటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు (గురువారం) ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టే వేళలో.. కేంద్రం పలు అంశాల మీద ఫుల్ క్లారిటీ ఇస్తుందని స్పష్టం చేసినప్పటికి.. అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ చాలామందిలో ఉంది. ఇది సామాన్యుల విషయంలోనే కాదు.. పాలకుల విషయంలోనూ.

సరిగ్గా ఇలాంటి సందేహాలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురయ్యాయి. సాదాసీదా జనమైతే.. అంచనాలు.. ఊహాగానాలు..లాజిక్కులతో సరిపెట్టుకుంటారు. కానీ.. ఇలాంటి పరిస్థితే చంద్రబాబుకు ఎదురైతే ఆయన ఎందుకు ఊరుకుంటారు చెప్పండి.

బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సమావేశంలో ఎదురైన సందేహాల్ని అప్పటికప్పుడే తీర్చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు.. ఆ వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లతో ఫోన్ లో మాట్లాడారు.

పునర్విభజన బిల్లులో లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపర్చకపోవటం ఏమిటి? దీనిపై నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించగా.. వారు స్పందిస్తూ.. బిల్లులోఅన్ని వివరాలు పొందుపర్చలేమని.. అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు 50 శాతం పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా ఈ అంశాన్ని పార్లమెంటు వేధికగా ప్రభుత్వం పేర్కొంటుందన్న అంశంపైనా చంద్రబాబుకు సమాచారం అందింది.

అనంతరం తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు.. కిషన్ రెడ్డి.. రామ్మోహన్ నాయుడుతోనూ మాట్లాడారు. కేంద్రమంత్రులతో స్వయంగా మాట్లాడి.. స్పష్టత తీసుకున్న అనంతరం బిల్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

50 శాతం నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని.. దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ ముగ్గురు డిసైడ్ అయ్యారు. చంద్రబాబుకు డౌట్ రావటం మామూలే అయినా.. దానిపై ఆయన ఇన్ స్టెంట్ గా క్లారిటీ తీసుకున్న వైనం.. కోట్లాది మంది తెలుగు వారికి సైతం స్పష్టతను ఇచ్చిందని చెప్పక తప్పదు.

This post was last modified on April 16, 2026 10:56 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రమోషన్లు బాగున్నాయి… జనాలు రావడమే తరువాయి

రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…

11 minutes ago

మోడీ-షా… మాములోళ్ళు కాదండోయ్

అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…

3 hours ago

‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…

4 hours ago

బిల్లు బీజేపీది అయితే వైసీపీ మద్దతు ఉండదా

బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…

5 hours ago

సభలో ప్రవేశ పెట్టే 3 బిల్లులు ఇవే… ఏ కూటమికి ఎంత బలం?

భారతదేశ చరిత్రలో ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 16)కు ఒక ప్రత్యేకత ఉండనుంది. సుదీర్ఘ విరామం తర్వాత లోక్ సభ…

6 hours ago

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…

6 hours ago