Political News

10 ఉమ్మ‌డి జిల్లాల్లో వైసీపీ గ‌ల్లంతేనా?

వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయంలో ఉన్నప్పుడు.. దానిని మార్చాలని ప్రయత్నించటమే పెద్ద తప్పిదం అవుతుంది. గతంలో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా ప్రజలు దానిని పట్టించుకోలేదు. నిజంగా ఆరోజు మూడు రాజధానులు అని ప్రకటించిన సమయంలో ప్రజల్లో ఆ తరహా చైతన్యం ఉండి ఉంటే కచ్చితంగా విశాఖపట్టణం, కర్నూలు, గుంటూరుజిల్లాలో వైసిపి విజయం సాధించి ఉండేది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం, అమరావతి, క‌ర్నూలులో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

ఈ పరిణామాల నుంచి అయినా జగన్ పాఠాలు నేర్చుకుని ఉంటే ప్రస్తుతం ఆయన చెబుతున్న `ప్లాన్ బి` అనేది తెరమీదకి వచ్చి ఉండేది కాదు. కానీ జారుడు బండపై పరుగులు పెడుతున్న జగన్ తన విధానాన్ని, తన పద్ధతిని మార్చుకోకపోవడంతో ఇప్పుడు `మావిగన్` అనే సరికొత్త ప్రణాళికను తెర‌ మీదకు తీసుకువచ్చారు.

పోనీ ఇదేనా సక్సెస్ అవుతుందా అంటే నవ్వుల పాలు అవుతోంది తప్ప… ప్రజల్లో బలమైన చర్చకు కానీ, వైసీపీ ఆశిస్తున్న సానుకూల పరిణామం దిశగా కానీ అడుగులు వేసేలా కనిపించడం లేదు. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి దాదాపు పది ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు పెద్ద ఎత్తున చెబుతున్నారు.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ఇటు ఐదు జిల్లాలకు-అటు ఐదు జిల్లాలకు కూడా అమరావతి రాజధాని కేంద్రంగా ఉంటుంది. రాయలసీమలో అనంతపురం, కడప వంటి వాటిని మిరహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ప్రజలకు ఇది కేంద్రంగానూ అదే విధంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా కూడా అనుకూలంగా ఉంటుంది.

దీంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, ఉమ్మడి కృష్ణ జిల్లా అటువైపు చిత్తూరు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల ప్ర‌జ‌లు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్న నేపథ్యం క‌నిపిస్తోంది.

దీంతో ఆయా జిల్లాల ప్రజలు కచ్చితంగా కూటమికి అనుకూలంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏ సామాజిక వర్గం జగనను అభిమానించిందో.. ఆ సామాజిక వర్గమే ఇప్పుడు అమరావతిని కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో జగన్ పేల్చిన మావి`గన్` ఏమాత్రం పేలగపోగా.. రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది అత్యంత బలమైన ప్రభావం చూపించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇతర అంశాల కంటే కూడా వచ్చే ఎన్నికల నాటికి అమరావతి రాజధాని అంశం ప్రధానంగా ప్రజల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

గత ఎన్నికల్లో గమనిస్తే ఇటువంటి భూములకు సంబంధించిన వ్యవహారమే ప్రజల మధ్య చర్చకు వచ్చింది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది జగన్ ను ఎంత బలంగా దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే భూముల వ్యవహారం రాజధాని రూపంలో జగన్‌కు శాపంగా పరిణమించే అవకాశం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఇప్పటికైనా జగన్ తన మైండ్ సెట్‌ను మార్చుకుంటారో లేదో చూడాలి.

This post was last modified on April 9, 2026 10:38 am

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

భానుడి బాదుడు మొదలు

నిజమేనండోయ్... భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా…

3 hours ago

తండెల్ దర్శకుడి సినిమాకు పెద్ద బ్రేక్?

చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…

5 hours ago

జగన్ ‘మావిగన్ జోకర్’ అంటున్న షర్మిల

వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్…

5 hours ago

వెక్కివెక్కి ఏడ్చిన బొత్స

వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు.…

6 hours ago

వైఎస్ మృతిపై అచ్చన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.…

6 hours ago

ప్రదీప్ ఇమేజ్ సరిపోవడం లేదు

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. లవ్ టుడే, డ్రాగన్,…

6 hours ago