Political News

ఇండియాలో కూడా స్ట్రెయిన్ కలకలం

బ్రిటన్ను కుదిపేస్తున్న స్ట్రెయిన్ కరోనా వైరస్ తాజాగా మనదేశంలో కూడా టెన్షన్ పెంచేస్తోంది. బ్రిటన్ నుండి ఇండియాకు వచ్చిన విమానంలో 25 మందికి కరోనా వైరస్ ఉండటమే ఇందుకు ప్రధానకారణం. కరోనా వైరస్సే రూపాంతరం చెంది స్ట్రెయిన్ కరోనాగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా రూపం మార్చుకున్న కరోనా వైరస్ దెబ్బకు బ్రిటన్ తల్లకిందులైపోతోంది. కరోనా వైరస్ కన్నా స్ట్రెయిన వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది బ్రిటన్లో. దాంతో బ్రిటన్ ప్రభుత్వం మళ్ళీ దేశమంతా లాక్ డౌన్ ప్రకటించేసింది.

బ్రిటన్ లోవ్యాపిస్తున్న స్ట్రెయిన్ దెబ్బ ప్రపంచం మీద ఏ స్ధాయిలో ఉందంటే భారత్ తో సహా దాదాపు 15 దేశాలు విమాన రాకపోకలను నిషేధించేశాయి. బ్రిటన్లో ఉన్న తమ పౌరులను వెనక్కు వచ్చేయాల్సిందిగా ఆయా దేశాలు పిలుపివ్వటం గమనార్హం. సరే ఈ విషయాలను వదిలేస్తే కొన్ని ప్రపంచదేశాల్లాగే భారత్ కూడా బ్రిటన్ కు విమాన రాకపోకలను నిషేధించింది. అయితే నిషేధం విధించేసమయానికే షెడ్యూల్ అయిన విమానం కాబట్టి చివరి విమానాన్ని అనుమతించింది.

అలా అనుమతించటమే మన కొంప ముంచినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే సోమవారం రాత్రి వచ్చిన చివరి విమానంలో దిగిన 266 మంది ప్రయాణీకుల్లో 25 మందికి కరోనా వైరస్ ఉందని వైద్యులు గుర్తించారు. బ్రిటన్ నుండి వచ్చిన విమాన ప్రయాణీకులందరినీ ప్రత్యేకంగా విమానాశ్రయంలోనే పరీక్షించారు. వారిలో 25 మందికి కరోనా ఉందని గుర్తించటమే కాకుండా స్ట్రెయిన్ కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో కేంద్రప్రభుత్వంలో టెన్షన్ మొదలైపోయింది.

అనుమానిత స్ట్రెయిన్ కరోనా సోకినట్లు గుర్తించిన 25 మంది డిల్లీ, కోలకత్తా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించింది. దాంతో కేంద్రప్రభుత్వం వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. పై రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో దిగిన వారిని వెంటనే ప్రత్యేకమైన ఐసొలేషన్ వార్డుల్లో ఉండాలని ఆదేశించింది. మొత్తానికి బ్రిటన్ అల్లాడించేస్తున్న స్ట్రెయిన కరోనా మనదేశంలోకి కూడా వచ్చేసిందేమో అని టెన్షన్ మొదలైపోయింది. వీళ్ళ నుండి సేకరించిన బ్లడ్ శాంపుల్సును పూణేలోని నేషనల్ ల్యాబరేటరీకి పరీక్షల నిమ్మితం పంపింది. ఈ రిజల్టు వస్తే కానీ టెన్షన్ తగ్గేట్లు లేదు.

This post was last modified on December 23, 2020 1:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: CoronaIndia

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

54 minutes ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

1 hour ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

1 hour ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

2 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

3 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

5 hours ago