పోయినసారంటే రాష్ట్రప్రయోజనాలని, తిరుపతి లోక్ సభలో పోటీ చేసే విషయమై చర్చించేందుకు చెప్పిన పవన్ కల్యాణ్ ఈసారి ఎందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు ? ఈనెలాఖరులో రెండు రోజుల ఢిల్లీ టూర్ పెట్టుకున్నారట పవన్. ఎందుకెళుతున్న విషయంపై పార్టీ నేతల్లోనే పూర్తి స్పష్టతైతే లేదు. కాకపోతే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అడగటానికే వెళుతున్నారనే టాక్ అయితే నడుస్తోంది.
ఇలా ఢిల్లీకి వెళ్ళి అలా అవకాశం ఇవ్వమని అడగ్గానే ఇచ్చేస్తారా ? అనే ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నేతలు చాలా ఉబలాటపడిపోతున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ట్రాక్ రికార్డున్న పార్టీ తరపున రేపటి ఉపఎన్నికల్లో పోటీ చేసినా ఫలితంలో పెద్ద తేడా ఏమీ ఉండదనే అనుకుంటున్నారు.
అలాంటిది పోటీ చేసే విషయంలో బీజేపీ దూకుడు చూపుతోంది. ఆ దూకుడుకు కళ్ళెం వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పోనీ జనసేనకు ఏమైనా బ్రహ్మండమైన బలముందా అంటే అదీలేదు. ఎందుకంటే ఇప్పటివరకు జనసేన తిరుపతి లోక్ సభలో పోటీనే చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధికి జనసేన మద్దతిచ్చిందంతే. ఇంతోటి భాగ్యానికే తిరుపతి లోక్ సభ పరిధిలో తమకు అపారమైన బలముందని జనసేన నేతలు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.
మరప్పుడు బీఎస్పీ అభ్యర్ధికి ఎన్ని ఓట్లొచ్చాయంటే బీజేపీకన్నా కాస్త ఎక్కువొచ్చాయంతే. అంటే బలం ప్రకారం చూస్తే రెండుపార్టీలు దాదాపు సమానంగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరిలాంటపుడు రెండుపార్టీల్లో ఏది పోటీ చేసినా ఫలితంలో పెద్దగా తేడా ఏమీ ఉండదనే అనుకోవాలి. ఇంతోటి దానికి రెండుపార్టీలు కూడా ఎందుకింతగా పంతానికి పోతున్నాయో అర్ధం కావటం లేదు. సరే ఒకసారి వెళ్ళి ఏదో నడ్డాను కలిసొచ్చానని చెప్పుకున్నారు. మరిపుడు రెండోసారి ఎందుకెళుతున్నట్లు ?
This post was last modified on December 23, 2020 1:37 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…