Political News

పవన్ మళ్లీ ఢిల్లీకి… ఈసారి ఎందుకెళుతున్నాడబ్బా ?

పోయినసారంటే రాష్ట్రప్రయోజనాలని, తిరుపతి లోక్ సభలో పోటీ చేసే విషయమై చర్చించేందుకు చెప్పిన పవన్ కల్యాణ్ ఈసారి ఎందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు ? ఈనెలాఖరులో రెండు రోజుల ఢిల్లీ టూర్ పెట్టుకున్నారట పవన్. ఎందుకెళుతున్న విషయంపై పార్టీ నేతల్లోనే పూర్తి స్పష్టతైతే లేదు. కాకపోతే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అడగటానికే వెళుతున్నారనే టాక్ అయితే నడుస్తోంది.

ఇలా ఢిల్లీకి వెళ్ళి అలా అవకాశం ఇవ్వమని అడగ్గానే ఇచ్చేస్తారా ? అనే ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నేతలు చాలా ఉబలాటపడిపోతున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ట్రాక్ రికార్డున్న పార్టీ తరపున రేపటి ఉపఎన్నికల్లో పోటీ చేసినా ఫలితంలో పెద్ద తేడా ఏమీ ఉండదనే అనుకుంటున్నారు.

అలాంటిది పోటీ చేసే విషయంలో బీజేపీ దూకుడు చూపుతోంది. ఆ దూకుడుకు కళ్ళెం వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పోనీ జనసేనకు ఏమైనా బ్రహ్మండమైన బలముందా అంటే అదీలేదు. ఎందుకంటే ఇప్పటివరకు జనసేన తిరుపతి లోక్ సభలో పోటీనే చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధికి జనసేన మద్దతిచ్చిందంతే. ఇంతోటి భాగ్యానికే తిరుపతి లోక్ సభ పరిధిలో తమకు అపారమైన బలముందని జనసేన నేతలు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.

మరప్పుడు బీఎస్పీ అభ్యర్ధికి ఎన్ని ఓట్లొచ్చాయంటే బీజేపీకన్నా కాస్త ఎక్కువొచ్చాయంతే. అంటే బలం ప్రకారం చూస్తే రెండుపార్టీలు దాదాపు సమానంగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరిలాంటపుడు రెండుపార్టీల్లో ఏది పోటీ చేసినా ఫలితంలో పెద్దగా తేడా ఏమీ ఉండదనే అనుకోవాలి. ఇంతోటి దానికి రెండుపార్టీలు కూడా ఎందుకింతగా పంతానికి పోతున్నాయో అర్ధం కావటం లేదు. సరే ఒకసారి వెళ్ళి ఏదో నడ్డాను కలిసొచ్చానని చెప్పుకున్నారు. మరిపుడు రెండోసారి ఎందుకెళుతున్నట్లు ?

This post was last modified on December 23, 2020 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

54 minutes ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

1 hour ago

పిఠాపురంలో జగన్ పై నాగబాబు సెటైర్లు!

పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…

1 hour ago

ఆమిర్ ప్రేయ‌సి చ‌రిత్ర మొత్తం త‌వ్వేశారు

ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…

2 hours ago

జగన్ నా ఆస్తులను లాక్కున్నారు: బాలినేని

జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…

2 hours ago

జన సైనికులను మించిన జోష్ లో పవన్

జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం…

3 hours ago