Political News

మమతకు వరుస షాకులు తగులుతున్నాయే

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల్లో ముగ్గురు ఎంఎల్ఏలు రాజీనామాలు చేశారు. బారక్ పూర్ ఎంఎల్ఏ శీలభద్ర దత్తా రాజీనామా చేశారు. అంతకు ముందు జితేంద్ర తివారి, సువేందు అధికారి రాజీనామాతో తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎంఎల్ఏల సంఖ్య మూడుకు చేరింది. వీరందరు పార్టీకి రాజీనామా చేశారే గానీ ఎంఎల్ఏ పదవులకు కాదు. రాజీనామాలు చేసిన ముగ్గురిలో మమతకు అత్యంత సన్నిహితుడు, పార్టీలో కీలక నేత సువేందు అధికారి రాజీనామా చేయటమే సంచలనంగా మారింది.

రాజీనామా చేసిన నేతలు ప్రస్తుతానికి ఏ పార్టీలోను చేరకపోయినా తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మమతను ఓడించటమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ముఖ్యమంత్రిని అన్నీ విధాలుగా అస్తిరపరిచేందుకు పెద్ద ప్లాన్ తోనే వెళుతోంది కమలంపార్టీ.

ఒకవైపు గవర్నర్ మమతప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిల భారత అధికారులను కేంద్రప్రభుత్వం కేంద్ర సర్వీసుల్లోకి పిలిపించుకుంటోంది. అయితే దీనికి మమతాబెనర్జీ అడ్డుపడుతుండటంతో మమత-కేంద్రప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కమలంపార్టీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించటం ద్వారా ముఖ్యమంత్రిని అభద్రతకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఇదంతా ఓవైపు చేస్తునే పార్టీలోని ఎంఎల్ఏలను, కీలక నేతలకు వల విసురుతోంది. మరి కమలంపార్టీ విసిరిన గాలానికి తగులుకున్నారో లేకపోతే పార్టీలో, వ్యక్తిగత సమస్యల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నారో తెలీదుకానీ ఇప్పటికి ముగ్గురు రాజీనామాలు చేశారు. మరి భవిష్యత్తులో ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో తెలీకుండా ఉంది. ఇటువంటి చర్యలు వల్ల తృణమూల్ కాంగ్రెస్ లో ఓ విధమైన అయోమయం పెరిగిపోతోందన్నది వాస్తవం.

This post was last modified on December 19, 2020 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

1 hour ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

5 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

8 hours ago