Political News

మమతకు వరుస షాకులు తగులుతున్నాయే

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల్లో ముగ్గురు ఎంఎల్ఏలు రాజీనామాలు చేశారు. బారక్ పూర్ ఎంఎల్ఏ శీలభద్ర దత్తా రాజీనామా చేశారు. అంతకు ముందు జితేంద్ర తివారి, సువేందు అధికారి రాజీనామాతో తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎంఎల్ఏల సంఖ్య మూడుకు చేరింది. వీరందరు పార్టీకి రాజీనామా చేశారే గానీ ఎంఎల్ఏ పదవులకు కాదు. రాజీనామాలు చేసిన ముగ్గురిలో మమతకు అత్యంత సన్నిహితుడు, పార్టీలో కీలక నేత సువేందు అధికారి రాజీనామా చేయటమే సంచలనంగా మారింది.

రాజీనామా చేసిన నేతలు ప్రస్తుతానికి ఏ పార్టీలోను చేరకపోయినా తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మమతను ఓడించటమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ముఖ్యమంత్రిని అన్నీ విధాలుగా అస్తిరపరిచేందుకు పెద్ద ప్లాన్ తోనే వెళుతోంది కమలంపార్టీ.

ఒకవైపు గవర్నర్ మమతప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిల భారత అధికారులను కేంద్రప్రభుత్వం కేంద్ర సర్వీసుల్లోకి పిలిపించుకుంటోంది. అయితే దీనికి మమతాబెనర్జీ అడ్డుపడుతుండటంతో మమత-కేంద్రప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కమలంపార్టీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించటం ద్వారా ముఖ్యమంత్రిని అభద్రతకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఇదంతా ఓవైపు చేస్తునే పార్టీలోని ఎంఎల్ఏలను, కీలక నేతలకు వల విసురుతోంది. మరి కమలంపార్టీ విసిరిన గాలానికి తగులుకున్నారో లేకపోతే పార్టీలో, వ్యక్తిగత సమస్యల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నారో తెలీదుకానీ ఇప్పటికి ముగ్గురు రాజీనామాలు చేశారు. మరి భవిష్యత్తులో ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో తెలీకుండా ఉంది. ఇటువంటి చర్యలు వల్ల తృణమూల్ కాంగ్రెస్ లో ఓ విధమైన అయోమయం పెరిగిపోతోందన్నది వాస్తవం.

Satya

Recent Posts

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

2 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

4 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

5 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

5 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

5 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

5 hours ago