ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెద్దపీట వేశారు. వారు చూస్తున్న శాఖలకు అధిక మొత్తంలో సొమ్ములు కేటాయించారు. వాస్తవంగా ఏపీ వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయలు కాగా.. దీనిలో 32 వేల 308 కోట్ల రూపాయలను మంత్రి లోకేష్ సారథ్యంలోని పాఠశాల విద్యకే కేటాయించారు. దీనివల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విద్యకు మెరుగైన సౌకర్యాలు ఏర్పడతాయి.
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీ రాజ్ రాఖకు 22 వేల 941 కోట్ల రూపాయల ను కేటాయించారు. తద్వారా.. పంచాయతీల పరిధిలో సమస్యల పరిష్కారం, గ్రామీణ మౌలిక వసతులకు ప్రాధాన్యం పెరగనుంది. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్నపంచాయతీ ప్రాజెక్టులకు మరింత ఊతం కూడా లభించనుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులకు రాష్ట్ర గ్రాంటు 10 చొప్పున వెచ్చించే వెసులు బాటు కూడా రానుంది.
ఆ తర్వాత స్థానంలో సాగు, తాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర జలవనరుల శాఖకు ఏకంగా 18 వేల 223 కోట్ల రూపాయలను కేటాయించడం గమనార్హం. గత 2025-26 వార్షిక బడ్జెట్తో పోల్చుకుంటే.. ఈ కేటాయింపుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. గత బడ్జెట్లోనే 18 వేల 150 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిదంగా వైద్య శాఖకు 19 వేల, 306 కోట్ల రూపాయలు, వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు, కీలకమైన ఇంధన శాఖకు రూ.13,934 కోట్లు కేటాయించారు.
తద్వారా.. ఆయా రంగాల్లో మెరుగైన అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి స్పష్టంగా కనిపించేలా 2026-27 వార్షిక బడ్జెట్ను వండి వార్చారనే చెప్పాలి. ఇక, కేంద్రం నుంచి వచ్చే సొమ్ము విషయంలో క్లారిటీ లేదు. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు దాదాపు సాయాన్ని ఎత్తివేసిన ప్రభావం ప్రస్తుత బడ్జెట్లో కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రం కీలకంగా భావిస్తున్న పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కూడా ఈ బడ్జెట్లో ఆశించిన మేరకు కేటాయింపులు జరిగాయనే చెప్పాలి.
This post was last modified on February 14, 2026 3:40 pm
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు…
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు…
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని అమరావతి ఇక, పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ప్రవేశ…
‘హిట్’ ఫ్రాంఛైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను. కంటెంట్లో ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే.. ‘హిట్’ను…
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లపై సెటైర్లు పేల్చారు. ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని తెలిసిందే. తన…