పార్టీని బలోపేతం చేయండి.. అని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపును కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భూమా అఖిల ప్రియ మరో రూపంలో అర్ధం చేసుకున్నారో.. ఏమో.. ఆమె తనదైన తరహాలో చక్రం తిప్పుతున్నారు. తనను తాను బలోపేతం చేసుకోవడంతోపాటు.. నియోజకవర్గాలను కూడా పంచేసుకున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆది నుంచి కూడా అఖిల ప్రియ ఓ విషయం చెబుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం తనకు అమ్మ అని.. నంద్యాల నియోజకవర్గం తనకు నాన్నతో సమానమని అనేవారు.
బహుశ.. ఉద్దేశం ఇదే అయినా.. రాజకీయంగా.. ఇలా నియోకవర్గాలను పంచేసుకోవడం.. అనేది ఎంత వరకు సమంజసం.. అనేది టీడీపీ నేతలు అంటున్న మాట. అయినా కూడా భూమా అఖిల ప్రియ మాత్రం దూకుడు ఆపడం లేదు. తన సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే నంద్యాలలో జగత్.. తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. అక్కతో సమానంగా హాట్ కామెంట్లు పేలుస్తున్నారు. అక్క ఎక్కడ ఉంటే.. తమ్ముడు అక్కడే ఉంటున్నాడు. అంటే.. మొత్తంగా నంద్యాలను జగత్, ఆళ్లగడ్డను అఖిల పంచేసుకున్నారు. అయితే.. ఇది పార్టీలో వ్యతిరేకతకు దారితీస్తోంది.
గత ఎన్నికల్లో అఖిల ఓడిపోయారని.. ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నా.. అధినేత చంద్రబాబు.. చోద్యంచూస్తున్నారని.. ఇలా అయితే.. పార్టీలో ఎంతో మంది వారసులు.. తమ్ముళ్లు-అన్నలు ఉన్నారని.. కాబట్టి.. వారంతా కూడా నియోజకవర్గాలను పంచేసుకుంటే.. మేమెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దీనిపై చంద్రబాబు లేఖలు అందాయి.
అయితే.. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ తరఫున ఎంతో కొంత వాయిస్ వినిపిస్తున్నది.. అఖిల ప్రియే కావడం.. సీనియర్లు అందరూ ఇంటికే పరిమితం కావడం.. పార్టీని నిలబెట్టేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం.. వంటి కారణాలతో భూమా కుటుంబం దూకుడుకు చంద్రబాబు అడ్డు చెప్పలేక పోతున్నారనే టాక్ కూడా ఉంది. అయితే.. రెండు నియోజకవర్గాలను అక్కా తమ్ముడు పంచుకోవడంపై మాత్రం నాయకులు గుస్సాగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 18, 2020 11:19 am
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…